Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా పేరును ఎంపిక చేయగానే ప్రణబ్ నొచ్చుకున్నారు : మన్మోహన్

దేశ ప్రధానిగా తన పేరును ఎంపిక చేయగానే సీనియర్ నేతగా ఉన్న ప్రణబ్ ముఖర్జీ తీవ్ర అసంతృప్తికి లోనై నొచ్చుకున్నారనీ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు.

Webdunia
శనివారం, 14 అక్టోబరు 2017 (15:40 IST)
దేశ ప్రధానిగా తన పేరును ఎంపిక చేయగానే సీనియర్ నేతగా ఉన్న ప్రణబ్ ముఖర్జీ తీవ్ర అసంతృప్తికి లోనై నొచ్చుకున్నారనీ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కొత్త పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఇందులో మన్మోహన్ పాల్గొని మాట్లాడుతూ, తాను యాక్సిడెంటల్‌గా (అనుకోకుండా) రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు తనను కేబినెట్‌లోకి ఆహ్వానించి ఆర్థిక మంత్రిని చేశారని చెప్పుకొచ్చారు. 
 
2004 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన తర్వాత ప్రణబ్‌ను ప్రధానిగా ఎన్నుకోకపోవడంతో ఆయన బాధపడే ఉంటారని వ్యాఖ్యానించారు. పైగా, తనకంటే ప్రణబ్ మంచి నేత అని మన్మోహన్ అన్నారు. మన్మోహన్ వాఖ్యలపై ట్విట్టర్‌లో కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. నిజమా? అని కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తే, ఆ ప్రమాదం కారణంగా పదేళ్లు భరించాల్సి వచ్చిందని మరికొందరు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇక నుంచి మిమ్మల్ని యాక్సిడెంటల్ పీఎం అని పిలుస్తామని మరికొందరు కామెంట్ చేశారు. రిమోట్ కంట్రోల్ ద్వారా మీరు ప్రధాని అయ్యారని ఇంకొకరు పోస్ట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు చిత్రాలపై నయనతారకు ఎందుకో అంత ఇష్టం??

Dhanush: ఎండలో చెప్పులు లేకుండా, చిరిగిన బట్టలు ధరించిన బిచ్చగాడిని : ధనుష్

Sukumar: మిస్ వరల్డ్ థాయ్‌లాండ్ సుచతా చువాంగ్స్రీ తో దర్శకుడు సుకుమార్

Deepika: భారత చిత్ర పరిశ్రమలో పనిచేసే తల్లులకు మద్దతు లేదు-రాధికా ఆప్టే

Prabhas : ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

తర్వాతి కథనం
Show comments