Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్ర మంత్రివర్గ విస్తరణ.. ఏడుగురు మహిళలకు చోటు.. ఆ ఇద్దరు రాజీనామా

Webdunia
బుధవారం, 7 జులై 2021 (23:22 IST)
కేంద్ర మంత్రివర్గంలో మార్పులు చేర్పులు నేపథ్యంలో సీనియర్‌ కేంద్ర మంత్రులైన రవి శంకర్‌ ప్రసాద్‌, ప్రకాశ్‌ జవదేకర్‌ కూడా తమ మంత్రి పదవులకు బుధవారం రాజీనామా చేశారు.

కేంద్ర మంత్రి వర్గం మెగా విస్తరణ నేపథ్యంలో కేంద్ర న్యాయశాఖ, ఐటీ శాఖ మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌, కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ కూడా తమ పదవులను వీడారు. ట్విట్టర్‌తో వివాదం, కొత్త ఐటీ రూల్స్‌పై అన్ని రంగాల నుంచి విమర్శలు రావడంతో రవి శంకర్‌ ప్రసాద్‌ను కేంద్ర మంత్రి వర్గం నుంచి తప్పించినట్లు సమాచారం.
 
మరోవైపు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌తోపాటు, కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్‌ హర్ష వర్థన్‌, కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్‌ పోక్రియాల్‌, సదానంద గౌడ వంటి సీనియర్‌ నేతలు, కీలక మంత్రులు తమ పదవులకు రాజీనామా చేయడం అందరికీ షాక్ ఇచ్చింది. 
 
మరోవైపు నరేంద్ర మోదీ క్యాబినెట్‌లో కొత్తగా చోటు దక్కిన వారిలో ఏడుగురు మహిళలు ఉన్నారు. ప్రముఖ న్యాయవాది, ఢిల్లీ ఎంపీ మీనాక్షి లేఖికి కేంద్ర మంత్రివర్గంలో స్థానం లభించింది. మీనాక్షి లేఖి బీజేపీ జాతీయ ప్రతినిధిగానూ పనిచేశారు. పలు సామాజిక సంస్ధల్లో ఆమె చురుకైన పాత్ర పోషించారు. ఇక యూపీలోని మిర్జాపూర్‌లో అప్నాదళ్ ఎంపీగా ఎన్నికైన అనుప్రియా సింగ్ పటేల్ కేంద్ర మంత్రిగా ప్రమాణం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 19: పహల్గామ్ దాడి బాధితురాలు హిమాన్షి నర్వాల్.. ఈ షోలో ఎంట్రీ ఇస్తారా?

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా విజయ్ ఆంటోనీ భద్రకాళి డేట్ ఫిక్స్

మోతేవారి లవ్ స్టోరీ’ అద్వితీయ విజయం,3 రోజుల్లో ఆకర్షించిన బ్లాక్ బస్టర్ సిరీస్

దక్షిణాది సినిమాల్లో నటనకు, బాలీవుడ్ లో గ్లామరస్ కు పెద్దపీఠ : పూజా హెగ్డే

మెక్‌డోవెల్స్ సోడా బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments