కేంద్ర మంత్రివర్గ విస్తరణ.. ఏడుగురు మహిళలకు చోటు.. ఆ ఇద్దరు రాజీనామా

Webdunia
బుధవారం, 7 జులై 2021 (23:22 IST)
కేంద్ర మంత్రివర్గంలో మార్పులు చేర్పులు నేపథ్యంలో సీనియర్‌ కేంద్ర మంత్రులైన రవి శంకర్‌ ప్రసాద్‌, ప్రకాశ్‌ జవదేకర్‌ కూడా తమ మంత్రి పదవులకు బుధవారం రాజీనామా చేశారు.

కేంద్ర మంత్రి వర్గం మెగా విస్తరణ నేపథ్యంలో కేంద్ర న్యాయశాఖ, ఐటీ శాఖ మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌, కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ కూడా తమ పదవులను వీడారు. ట్విట్టర్‌తో వివాదం, కొత్త ఐటీ రూల్స్‌పై అన్ని రంగాల నుంచి విమర్శలు రావడంతో రవి శంకర్‌ ప్రసాద్‌ను కేంద్ర మంత్రి వర్గం నుంచి తప్పించినట్లు సమాచారం.
 
మరోవైపు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌తోపాటు, కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్‌ హర్ష వర్థన్‌, కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్‌ పోక్రియాల్‌, సదానంద గౌడ వంటి సీనియర్‌ నేతలు, కీలక మంత్రులు తమ పదవులకు రాజీనామా చేయడం అందరికీ షాక్ ఇచ్చింది. 
 
మరోవైపు నరేంద్ర మోదీ క్యాబినెట్‌లో కొత్తగా చోటు దక్కిన వారిలో ఏడుగురు మహిళలు ఉన్నారు. ప్రముఖ న్యాయవాది, ఢిల్లీ ఎంపీ మీనాక్షి లేఖికి కేంద్ర మంత్రివర్గంలో స్థానం లభించింది. మీనాక్షి లేఖి బీజేపీ జాతీయ ప్రతినిధిగానూ పనిచేశారు. పలు సామాజిక సంస్ధల్లో ఆమె చురుకైన పాత్ర పోషించారు. ఇక యూపీలోని మిర్జాపూర్‌లో అప్నాదళ్ ఎంపీగా ఎన్నికైన అనుప్రియా సింగ్ పటేల్ కేంద్ర మంత్రిగా ప్రమాణం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: సమంత- రాజ్ వివాహం.. శామ్ చేతిలో మెరిసిన డైమండ్ రింగ్ గురించి?

Rashmika: 2025లో అత్యంత ప్రజాదరణగల తారలు, దర్శకులుగా రష్మిక మందన్నా, రిషబ్ శెట్టి ప్రకటించిన IMDb

Sholay 4K : సినీపోలిస్ ఇండియా స్వర్ణోత్సవాల కోసం షోలే 4K డిజిటల్‌ పెద్ద తెరపైకి

శ్రీలంకకు మానవతా సాయం... కాలం చెల్లిన ఆహారాన్ని పంపిన పాకిస్థాన్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments