Webdunia - Bharat's app for daily news and videos

Install App

సరుకుల కోసం పక్కూరికెళ్లిన తల్లి - కుమార్తెను కాటేసిన కన్నతండ్రి

Webdunia
గురువారం, 15 జులై 2021 (12:28 IST)
కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే కామాంధుడుగా మారిపోయాడు. ఫలితంగా కన్నతండ్రిపై అత్యాచారం జరిపారు. ఈ దారుణం ఏపీలోని ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలంలో జరిగింది. 15 ఏళ్ల కుమార్తెపై కన్నతండ్రే పలుమార్లు అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్నతండ్రే కుమార్తెను చెరబట్టాడు. 
 
బాధితురాలి ఫిర్యాదు మేరకు మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి ఊరికి దూరంగా నివాసం ఉంటున్నాడు. జనవరి నెలలో బాలిక తల్లి సరకుల తీసుకొచ్చేందుకు పక్కనే ఉన్న సంగరపల్లికి వెళ్లింది. ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్న తండ్రి బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
 
అప్పటి నుంచి పలుదఫాలుగా అత్యాచారం చేశాడు. ఈ విషయం బయటికి చెబితే తల్లి, కూమార్తెను చంపేస్తానంటూ బెదిరించేవాడు. తరచూ బాలికను కొడుతుండటంతో సుమారు 20 రోజుల కిందట 100 నంబరుకు ఫోన్‌ చేసింది. 
 
పోలీసులు వెళ్లి మందలించారు. ఆ తరువాత బాలిక.. అవ్వ, తాతల ఇంటికి వెళ్లింది. జరిగిన విషయాన్ని వాళ్లకు చెప్పడంతో బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు విచారణ చేపట్టారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments