Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇక ప్రజ్ఞాన్ రోవర్ కథ ముగిసినట్టే ... స్పందించిన ఇస్రో చీఫ్

Webdunia
శుక్రవారం, 29 సెప్టెంబరు 2023 (08:57 IST)
చంద్రుడిపై నిద్రాణ స్థితిలో ఉన్న ప్రజ్ఞాన్ రోవర్ ఇప్పటివరకు మేల్కొనలేదు. దీంతో దాని కథ ముగిసినట్టుగానే శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇదే అంశంపై భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చీఫ్ ఎస్. సోమనాథ్ స్పందించారు. చంద్రయాన్-3లో భాగంగా చంద్రుడిపై ప్రయోగించిన ప్రజ్ఞాన్ రోవర్ తన పని పూర్తి చేసిందని చెప్పారు. ఇది నిద్రాణస్థితి నుంచి బయటకు రాకపోయినా ఇబ్బందేమీ లేదన్నారు. 
 
ఖగోళాన్ని మరింత లోతుగా అర్థం చేసుకునేందుకు వీలుగా ఎక్సే‌రే పోలారిమీటర్ ఉపగ్రహ ప్రయోగంపై ప్రస్తుతం దృష్టిసారించినట్టు చెప్పారు. ఎక్స్‌పోశాట్‌తో పాటు ఇన్‌శాట్-3డీని కూడా నవంబరు, డిసెంబరు నెలల్లో ప్రయోగించనున్నట్టు ఆయన తెలిపారు. 
 
గత ఆగస్టు నెలలో ప్రయోగించిన చంద్రయాన్-3 ప్రాజెక్టు విజయవంతమైన విషయం తెల్సిందే. ఈ ప్రయోగం ద్వారా చంద్రుడి దక్షిణ ధృవంపై ప్రజ్ఞాన్ రోవర్, విక్రమ్ ల్యాండర్‌లను విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ చేశారు. ఆ తర్వాత 14 రోజుల పాటు అవి తమ పనిని సమర్థవంతంగా పూర్తి చేసిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో గత పక్షం రోజులుగా నిద్రాణస్థితిలో ఉన్న విక్రమ్, ప్రజ్ఞాన్‌లు ఇపుడు చంద్రుడిపై ఎండ వచ్చినప్పటికీ మేల్కొనలేదు. దీంతో వీటి కథ ముగిసినట్టుగా భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mokshagna: 30వ ఏట మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ.. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ రెడీ

విజయ్ ఆంటోనీ భద్రకాళి నుంచి లవ్ సాంగ్ మారెనా రిలీజ్

Anupama Parameswaran: ఆ సమస్యకి నా దగ్గర ఆన్సర్ లేదు : అనుపమ పరమేశ్వరన్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర రిలీజ్ లో పెద్ద ట్విస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments