Webdunia - Bharat's app for daily news and videos

Install App

తస్మాత్ జాగ్రత్త... ఈవీఎంల ఖచ్చితత్వాన్ని ప్రశ్నిస్తే జైలుకే?

Webdunia
మంగళవారం, 30 ఏప్రియల్ 2019 (11:04 IST)
కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించిన ఎన్నికల నిబంధన ఒకటి ఇపుడు చర్చనీయాంశంగా మారింది. ఈవీఎంల ఖచ్చితత్వాన్ని ప్రశ్నిస్తే జైలుకు లేదా రూ.వెయ్యి అపరాధం చెల్లించాలన్నది ఆ నిబంధనగా ఉంది. ఈ నిబంధనను ఇపుడు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. దీన్ని రద్దు చేయాలంటూ సునీల్ ఆహ్వా అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 
 
సాధారణంగా ఎన్నికల పోలింగ్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఈవీఎంలను వినియోగిస్తోంది. ఇందులో ఉండే ఒక బటన్ నొక్కితే వీవీప్యాట్‌లో మరో గుర్తుకనబడిందని అనేక మంది ఆరోపిస్తున్నారు. 
 
అయితే, ఇకపై ఇలాంటి ఆరోపణలు చేయడానికి వీల్లేదు. ఓటరు ఏ గుర్తుపై అయితే బటన్ నొక్కుతాడో వీవీప్యాట్‌లో కూడా అదే గుర్తుపడిందని చెప్పాల్సిందే. మరో గుర్తుకు పడిందని చెబితే మాత్రం ఆరు నెలలు జైలుశిక్ష లేదా రూ.1000 వెయ్యి అపరాధం చెల్లించాల్సి ఉంటుంది. 
 
ఇదే కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించిన నిబంధన. ఈ నిబంధనపై సునీల్ ఆహ్వా అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన కోర్టు.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసు జారీచేసింది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments