Webdunia - Bharat's app for daily news and videos

Install App

శబరిమలైలో అయ్యప్ప భక్తులపై పోలీసుల లాఠీచార్జ్

Webdunia
మంగళవారం, 19 డిశెంబరు 2023 (14:13 IST)
శబరిమలైలో అయ్యప్ప భక్తులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. గత కొన్ని రోజులుగా శబరిమల పుణ్యక్షేత్రంలో అయ్యప్ప భక్తులతో విపరీతమైన రద్దీ నెలకొనివున్న విషయం తెల్సిందే. భక్తులకు తగినవిధంగా ట్రావెన్‌కోర్ ఆలయ అధికారులు తగిన సౌకర్యాలు కూడా కల్పించలేదు. దీంతో భక్తుల అన్ని విధాలుగా ఇబ్బందులకు గురవుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి కూడా శబరిమల మార్గం మధ్యలో అయ్యప్ప స్వాములను నిలిపివేశారు. తాళ్లను కుట్టి భక్తులను గంటల కొద్దీ నిలువుకాళ్లపై నిలబెట్టారు. దీంతో విసిగిపోయిన అధికారులు... చిన్నపిల్లలు, వృద్దులు కూడా ఉన్నారని, ఎంతసేపు నిలబెడతారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులకు, అయ్యప్ప భక్తుల మధ్య వాగ్వాదం జరగడంతో ఆగ్రహించిన పోలీసులు అయ్యప్ప భక్తులపై లాఠీచార్జ్ చేశారు. 
 
మరోవైపు, శబరిమలలో అయ్యప్ప భక్తుల రద్దీ రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. భక్తుల రద్దీతో శబరిగిరులు కిటకిటలాడుతున్నాయి. పంబ నది నుంచి శబరిమల వరకు అయ్యప్ప భక్తులతో రద్దీగా మారింది. దీంతో అధికారులు అయ్యప్ప భక్తులను మధ్యలో నిలిపేశారు. రద్దీని నియంత్రించేందుకు ఈవిధంగా చర్యలు తీసుకోవల్సి వస్తుందని అధికారులు అంటున్నారు. భక్తులను నియంత్రించే క్రమంలో వారిపై పోలీసులు లాఠఛార్జ్ కూడా చేస్తున్నారు. దీంతో అయ్యప్ప భక్తులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments