Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికపై సామూహిక అత్యాచారం.. రెండు వేల రూపాయలు చేతిలో పెట్టి..?

Webdunia
శనివారం, 27 జూన్ 2020 (13:27 IST)
బాలికపై పోలీసులే అకృత్యానికి పాల్పడ్డారు. ఓ బాలికపై మూడు నెలలు పోలీస్ స్టేషన్‌లో సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. లాక్‌డౌన్ వల్ల ఇంటికి వెళ్లలేక దిక్కులు చూస్తున్న బాలికకు సాయం చేస్తామని చెప్పి అత్యాచారకాండ సాగించారు. 
 
మూడునెలలు అమ్మాయికి నరకం చూపించారు. ఈ క్రమంలో బాధితురాలికి గర్భం రావడంతో అబార్షన్ చేయించి, ఎవరికీ చెప్పొద్దంటూ రెండువేలు చేతిలో పెట్టి పంపారు. ఈ ఘటన ఒడిశాలోని సుందర్ గడ్‌ జిల్లాలోని బీరమిత్రపూర్‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే..13 ఏళ్ల బాలిక రోడ్డుపై ఒంటరిగా కనిపించడంతో బీరమిత్రపూర్ పోలీసులు ఆమె స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఇన్‌చార్జి ఆనంద చంద్ర మఝి అత్యాచారం చేశాడు. తర్వాత ఆమె బెదిరించి ఇంట్లో వదిలేశారు. 
 
రోజూ పోలీస్ స్టేషన్‌కు రావాలని ఆదేశించారు. బాలిక పెంపుడు తండ్రి భయపడిపోయి అమ్మాయిని అలాగే చేయాలన్నాడు. బాధితురాలు ప్రాణభయంతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. మూడు నెలల పాటు స్టేషన్ సిబ్బంది వంతుల వారీగా ఆమెపై ఘోరానికి పాల్పడ్డారు. ఇంకా నిందితులైన పోలీసులను సస్పెండ్ చేశారు. 
 
విషయం తెలుసుకున్న మరో ఇద్దరు యువకులు కూడా కాటేశారు. అనారోగ్యం పాలైన బాలికను ఈ నెల 16 ఆస్పత్రికి తరలించగా గర్భం దాల్చినట్లు తేలింది. పోలీసులు డాక్టర్లను బెదిరించి గర్భస్రావం చేయించారు. మహిళా సంక్షేమ సంఘం జోక్యంతో ఈ ఘటనపై కేసు నమోదైంది. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments