ప్రధాని అధ్యక్షతన అఖిలపక్ష భేటీ.. నిఘాను పెంచిన పోలీసులు

Webdunia
గురువారం, 24 జూన్ 2021 (10:26 IST)
కాశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పించే అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో అఖిలపక్ష నేత‌ల‌ సమావేశం జ‌రుగ‌నుంది. ఢిల్లీలో ఈ భేటీ జరుగనుంది. దీంతో సమావేశం జరుగనున్న ప్రాంతంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 
 
ప్రత్యేకించి నియంత్రణ రేఖ వెంబడి గ‌ల‌ ప్రాంతాల్లో 48 గంటలపాటు హై అలర్ట్‌ విధించారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అక్కడి భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. జమ్మూకాశ్మీర్‌ ప్రత్యేక ప్రతిపత్తిని పునరుద్ధరించడం సహా పలు కీలక అంశాలపై గురువాం సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.
 
ఈ నేపథ్యంలో అక్కడ అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రభుత్వం అప్రమత్తమైంది. అందులో భాగంగా జమ్మూకాశ్మీర్‌లో ఇంటర్నెట్‌ సేవలను సైతం నిలిపివేయ‌నున్న‌ట్లు స‌మాచారం. రాజ్యాంగంలోని అధికరణ 370 ని రద్దు చేసిన రెండేళ్ల తర్వాత జమ్ముకాశ్మీర్‌ నేతలతో కేంద్రం భేటీ కానుండటం గమనార్హం. 
 
కాగా, ప్ర‌ధానితో అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యేందుకు పీపుల్స్‌ అలయన్స్‌ ఫర్‌ గుప్‌కార్ డిక్లరేషన్ (పీఏజీడీ) సహా కాంగ్రెస్‌, ఇతర రాజకీయ పార్టీల నేతలు అంగీకారం తెలిపారు. పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ, జమ్మూకశ్మీర్ బీజేపీ అధ్యక్షుడు రవీందర్‌ రైనా, మాజీ ఉపముఖ్యమంత్రి కవీందర్‌ గుప్తా బుధవారం ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీకి వెళ్లారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చికిరి చికిరి పాటకు నేపాల్ అమ్మాయి స్టెప్పులు.. అదరగొట్టేసిందిగా.. ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ధర్మేంద్ర... ఇంట్లోనే వైద్య సేవలు

'ది గర్ల్ ఫ్రెండ్' కోసం ముఖ్య అతిథిగా హాజరుకానున్న విజయ్ దేవరకొండ?

నవంబర్ 15న జియోహాట్‌స్టార్‌లో ఎస్ఎస్ రాజమౌళి గ్లోబ్‌ట్రోటర్ ఫస్ట్ లుక్, టీజర్ లాంచ్‌ లైవ్ స్ట్రీమ్

మహిళల శరీరాకృతి ఎపుడూ ఒకేలా ఉండదు : మిల్కీ బ్యూటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

తర్వాతి కథనం
Show comments