గురువారం ఉదయం స్వచ్ఛ్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు వెళుతున్న సమయంలో ఢిల్లీ నగరంలోని మందిర్ మర్గ్ పోలీస్ స్టేషన్ను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అయితే, ఆ సమయంలో అక్కడ ఉండాల్సిన పోలీసు అధికారుల్లో ఒక్కరు కూడా లేరు.
ఎక్కడికెళ్లారని ఆరా తీస్తే, సమీపంలోని వాల్మీకి సదన్ వద్ద ప్రధాని పర్యటన బందోబస్తులో ఉన్నారని సమాధానమొచ్చింది. చేసేదేముంది, అక్కడే చీపురు పట్టిన ప్రధాని, పోలీస్ స్టేషన్ను ఊడ్చారు.
పోలీస్ స్టేషన్ను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలని అక్కడి పోలీసు సిబ్బందికి సూచించారు. అనంతరం ఆయన అక్కడి నుంచి నేరుగా వాల్మీకి సదన్కు వెళ్లారు.