Webdunia - Bharat's app for daily news and videos

Install App

నల్లకుబేరులను ప్రభుత్వం ఉరితీయదు.. కానీ 30 తర్వాత చుక్కలే : ప్రధాని మోడీ హెచ్చరిక

దేశంలోని నల్లకుబేరులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గట్టి హెచ్చరిక చేశారు. డిసెంబర్ 30వ తేదీ తర్వాత నల్లకుబేరులకు పగటిపూటే చుక్కలు కనిపిస్తాయని అన్నారు. దేశంలో నానాటికీ పెరిగిపోతున్న అవినీతి, నల్లధనంపై త

Webdunia
ఆదివారం, 25 డిశెంబరు 2016 (10:53 IST)
దేశంలోని నల్లకుబేరులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గట్టి హెచ్చరిక చేశారు. డిసెంబర్ 30వ తేదీ తర్వాత నల్లకుబేరులకు పగటిపూటే చుక్కలు కనిపిస్తాయని అన్నారు. దేశంలో నానాటికీ పెరిగిపోతున్న అవినీతి, నల్లధనంపై తమ ప్రభుత్వం ప్రకటించిన యుద్ధం ఇప్పట్లే ఆగదన్నారు. గెలుపు సాధించేదాకా ఈ సమరం ఆగదని స్పష్టం చేశారు. 
 
పూణె, ముంబైలలో జరిగిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొని ప్రసంగిస్తూ... ‘డిసెంబరు 30’ తర్వాత అవినీతిపరులు, అక్రమార్కుల పతనం తథ్యమని హెచ్చరించారు. నల్లకుబేరులు దారికి రావాల్సిందేనని స్పష్టంచేశారు. ఇప్పటికైనా వాళ్లు ఈ దేశ చట్టాలను గౌరవించాలని పిలుపునిచ్చారు. ‘‘అక్రమార్కులను ఉరి తీయాలని, కఠినంగా శిక్షించాలని ప్రభుత్వం భావించడంలేదు. కానీ, పేదలకు మాత్రం మేలు జరగాల్సిందే. వారి నుంచి లాక్కున్నది తిరిగి ఇచ్చేయండి. ఇంకా వారికి సమయం ఉంది. ఈ దేశ చట్టాలను గౌరవించండి. హాయిగా నిద్రపోండి’’ అని నల్ల కుబేరులకు పిలుపునిచ్చారు.
 
‘‘మీకు నేనంటే భయంలేకపోవచ్చు. చట్టాలంటే భయం లేకపోవచ్చు. 125 కోట్ల మంది ప్రజలంటే మాత్రం మీరు భయపడాల్సిందే. వారిని తక్కువ అంచనా వేయవద్దు. అవినీతిని, నల్లధనాన్ని భరించేందుకు వాళ్లు సిద్ధంగాలేరు’’ అని తేల్చిచెప్పారు. ఇప్పుడున్నది పాత ప్రభుత్వం కాదని గుర్తుచేశారు. ‘‘తప్పించుకోవడానికి ఏదో ఒక దారి ఉంటుందనుకుంటే మీరు పొరబడినట్లే. కొందరు బ్యాంకుల్లో డబ్బులు వేసుకుని... ఆ తర్వాత దానిని తెలుపు చేసుకుందామనుకుంటున్నారు. ఆ డబ్బు తెలుపు కాదు. కానీ, వారి ముఖాలు మాత్రం నల్లబడటం ఖాయమన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments