Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉగ్రదాడికి పాల్పడిన వారికి.. కుట్రదారులకు కఠిన శిక్ష తప్పదు : ప్రధాని మోడీ హెచ్చరిక

ఠాగూర్
ఆదివారం, 27 ఏప్రియల్ 2025 (14:23 IST)
పహల్గాంలో ఉగ్రదాడికి పాల్పడిన వారికి, వారి వెనుక ఉన్న కుట్రదారులకు కఠిన శిక్ష తప్పదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోమారు హెచ్చరించారు. పహల్గాంలో అమాయక పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి భారతదేశ ఆత్మపై జరిగిన దాడిగా అభివర్ణిస్తున్నట్టు తెలిపారు. దీని వెనుక ఉన్న కుట్రదారులకు అత్యంత కఠిన శిక్ష తప్పదని ఆయన హెచ్చరించారు. బాధితుల కుటుంబాలకు తప్పకుండా న్యాయం జరుగుతుందని ప్రధాని భరోసా ఇచ్చారు. 
 
ఆదివారం తన నెలవారీ రేడియో కార్యక్రమం అయిన మన్ కీ బాత్ 121వ ఎపిసోడ్‌లో జాతినుద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించారు. ఏప్రిల్ 22వ తేదీన పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి ప్రతి భారతీయుడుని కలిచివేసిందన్నారు. 'ఈ రోజు మీతో నా మనసులోని మాటను పంచుకుంటున్నన వేళ, నా హృదయం తీవ్ర వేదనతో నిండివుంది. పహల్గామ్ ఉగ్రదాడి ప్రతి పౌరుడి హృదయాన్ని గాయపరిచింది. బాధితుల కుటుంబాల పట్ల ప్రతి భారతీయుడు తీవ్ర సానుభూతి వ్యక్తం చేస్తున్నాడు. ఏ రాష్ట్రానికి చెందిన వారైనా, ఏ భాష మాట్లాడే వారైనా ఈ దాడిలో తమ ఆత్మీయులను కోల్పోయిన వారి బాధను అనుభవిస్తున్నాను' అని పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాశ్మీర్ ఇండియాదే, పాకిస్తాన్‌ను అలా వదిలేస్తే వాళ్లలో వాళ్లే కొట్టుకుని చస్తారు: విజయ్ దేవరకొండ

మాలీవుడ్‌‍ను కుదిపేస్తున్న డ్రగ్స్... మరో ఇద్దరు దర్శకులు అరెస్టు

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

మైథికల్ థ్రిల్లర్ జానర్‌ లో నాగ చైతన్య 24వ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

తర్వాతి కథనం
Show comments