PM tour in AP: ప్రధాని ఏపీ పర్యటనలో అపశృతి.. కరెంట్ షాకుతో ఒకరు మృతి (video)

సెల్వి
గురువారం, 16 అక్టోబరు 2025 (15:44 IST)
Nannur
ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తున్నారు. సూపర్‌ జీఎస్టీ - సూపర్‌ సేవింగ్స్‌’ పేరుతో కర్నూలు శివారులోని నన్నూరు వద్ద భారీ బహిరంగ సభ జరుగుతోంది. 450 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాట్లు చేశారు. లక్షలాది మంది సభకు హాజరయ్యారు. ఈ వేదిక నుంచే ప్రధాని మోదీ రూ.13,429 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు వర్చువల్‌గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. 
 
జీఎస్టీ 2.0 నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వం దసరా పండుగ నుంచే విస్తృత ప్రచారం ప్రారంభించింది. ప్రధాని ఉదయం దిల్లీ నుంచి బయల్దేరి కర్నూలు చేరుకుని, అక్కడి నుంచి శ్రీశైలం వెళ్లారు. భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. తరువాత శివాజీ స్పూర్తి కేంద్రాన్ని సందర్శించి, మధ్యాహ్నం రెండు గంటల తర్వాత కర్నూలు సభకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌, మంత్రి నారా లోకేశ్‌ తదితరులు పాల్గొన్నారు. 
 
అయితే ఈ సభలో అపశృతి చోటుచేసుకుంది. నన్నూరు సభా ప్రాంగణం వద్ద కరెంట్ షాక్ కొట్టి ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలైనాయి. మృతుడు కర్నూలు జిల్లా మునగాలపాడు గ్రామానికి చెందిన అర్జున్‌గా గుర్తించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

Rajamouli : బాహుబలి ది ఎపిక్ తో సరికొత్త ఫార్మెట్ లో రాజమౌళి మార్కెటింగ్ సక్సెస్

Rashmika : రష్మిక మందన్న ఫిల్మ్ మైసా కి స్టార్ కంపోజర్ జేక్స్ బిజోయ్ మ్యూజిక్

OG Trend: ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ ఓజీతో నయా ప్లాట్‌ఫాం గ్రాండ్ ఎంట్రీ..

Rahul Sankrityan: వీడీ 14 లో విజయ్ దేవరకొండ విశ్వరూపం చూస్తారు - రాహుల్ సంకృత్యన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments