Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు కర్నాటక - మహారాష్ట్రలలో ప్రధాని మోడీ పర్యటన

Webdunia
గురువారం, 19 జనవరి 2023 (13:23 IST)
దేశంలో త్వరలోనే మూడు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ గురువారం రెండు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా తొలుత ఆయన కర్నాటకలో పర్యటిస్తారు. ఆ తర్వాత మహారాష్ట్రకు వెళతారు. 
 
కర్నాటక రాష్ట్ర పర్యటనలో యాదగిరి, కలబురిగి జిల్లాలో ఆయన పర్యటిస్తారు. కొడెకలో సాగునీరు, తాగునీరు, జాతీయ రహదారి అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన శుంకుస్థాపనలు చేస్తారు. 560 గ్రామాల్లో మూడు లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చేలా సాగునీటి ప్రాజెక్టుకు కూడా ఆయన శంకుస్థాపన చేస్తారు. 
 
అలాగే, సాయంత్రం మహారాష్ట్ర పర్యటనకు వెళతారు. ఛత్రపతి మహారాజ్ టెర్మినల్ పునరాభివృద్ధి పనులను ఆయన ప్రారంభిస్తారు. అలాగే, రూ.38800 కోట్ల వ్యయంతో చేపట్టే ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు చేస్తారు. ముంబై మెట్రోలో రెండు లైన్లను ఆయన ప్రారంభిస్తారు. ఈ మార్గాన్ని ఆయన జాతికి అంకితం చేస్తారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments