Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో పెరిగిపోతున్న కోవిడ్ కేసులు.. పీఎం ప్రధాని హైలెవల్ మీటింగ్

Webdunia
బుధవారం, 22 మార్చి 2023 (16:03 IST)
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల నమోదులో భారీ వృద్ధి నమోదవుతుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో కరోనా పరిస్థితి, ప్రజా ఆరోగ్యశాఖ సన్నద్ధతపై ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై ఇందులో చర్చిస్తున్నారు. 
 
ఇదిలావుంటే, కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం గడిచిన 24గంటల వ్యవధిలోనే 1,134 కొత్త కేసులు నమోదు కావడంతో మొత్తం క్రియాశీల కేసుల సంఖ్య 7,026కి చేరింది. మంగళవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 1,03,831 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 1,134 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. అలాగే, తాజాగా కరోనా కారణంగా ఛత్తీస్‌గఢ్‌, ఢిల్లీ, గుజరాత్‌, మహారాష్ట్ర, కేరళలో ఒక్కొక్కరు చొప్పున మొత్తం ఐదుగురు కొవిడ్‌తో చనిపోయారు. 
 
ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 95.05 కోట్ల మందికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా.. 4,46,98,118మందిలో వైరస్‌ ఉన్నట్టు తేలినట్టు కేంద్ర గణాంకాలు పేర్కొంటున్నాయి. మంగళవారం ఒక్కరోజే దేశ వ్యాప్తంగా 662 మంది కోలుకోవడంతో మొత్తంగా కోలుకున్నవారి సంఖ్య 4,41,60,279కి (రికవరీ రేటు 98.79శాతం) చేరింది. అలాగే, రోజువారీ పాజిటివిటీ రేటు 1.09 శాతంగా ఉండగా.. వీక్లీ పాజిటివిటీ రేటు 0.98 శాతంగా ఉంది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments