కలాం స్మారకార్థం అయోధ్య వీక్లీ ఎక్స్‌ప్రెస్.. జెండాఊపనున్న ప్రధాని మోడీ

మాజీ రాష్ట్రపతి, భారతరత్న అబ్దుల్ కలాం రెండో వర్థంతి వేడుకలు ఘనంగా జరుగనున్నాయి. భారత రక్షణ రంగ పరిశోధనా, అభివృద్ధి సంస్థ డీఆర్డీవో ఆధ్వర్యంలో నిర్మించిన స్మారక మండపంతో పాటు.. సైన్స్ నాలెడ్జ్ పార్కును

Webdunia
గురువారం, 27 జులై 2017 (11:09 IST)
మాజీ రాష్ట్రపతి, భారతరత్న అబ్దుల్ కలాం రెండో వర్థంతి వేడుకలు ఘనంగా జరుగనున్నాయి. భారత రక్షణ రంగ పరిశోధనా, అభివృద్ధి సంస్థ డీఆర్డీవో ఆధ్వర్యంలో నిర్మించిన స్మారక మండపంతో పాటు.. సైన్స్ నాలెడ్జ్ పార్కును ప్రధాని నరేంద్ర మోడీ గురువారం ప్రారంభించనున్నారు. ఈ మండపం.. కలాంను ఖననం చేసిన రామేశ్వరంలోని పేయికరంబు ప్రాంతంలో నిర్మించారు. దీన్ని ప్రారంభం కోసం ప్రధాని మోడీ ఢిల్లీ నుంచి రామేశ్వరంకు చేరుకుంటారు. అలాగే, గ్రీన్ రామేశ్వరం ప్రాజెక్టును కూడా ఆయన ప్రారంభిస్తారు. 
 
ఈ స్మారక మందిరం ప్రారంభం తర్వాత కలాం స్మారకార్థం రామేశ్వరం నుంచి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫైసలాబాద్ వరకు నడిచే అయోధ్య వీక్లీ ఎక్స్‌ప్రెస్‌కు ఆయన జెండాఊపి ప్రారంభిస్తారు. ఈ రైలు రామేశ్వరం తర్వాత మానామదురై, తిరుచ్చి, తంజావూరు, విలుపురం, చెన్నై ఎగ్మోర్‌, గూడూరు, విజయవాడ, వరంగల్‌, బల్హార్షా, నాగ్‌పూర్‌, ఇటార్సీ, సాత్నా, అలహాబాద్‌, జౌన్పూర్‌, అయోధ్య స్టేషన్‌లలో ఆగుతుంది. 
 
16793 నంబరుతో నడిచే రెగ్యులర్‌ వీక్లీ రైలు రామేశ్వరంలో ప్రతి ఆదివారం రాత్రి 23.50 గంటలకు బయలుదేరి చెన్నైకి మరుసటి రోజు సాయంత్రం 15.00 గంటలకు చేరుకుంటుంది. అలాగే, గమ్యస్థానమైన ఫైసలాబాద్‌కు బుధవారం ఉదయం 8.30 గంటలకు చేరుతుంది. అలాగే, తిరుగు ప్రయాణంలో (రైలు నంబరు 16794) ప్రతి బుధవారం రాత్రి 23.55 గంటలకు ఫైసలాబాద్‌లో బయలుదేరి చెన్నైకి మరుసటి రోజు సాయంత్రం 18.35 గంటలకు చేరుకుని, అక్కడ నుంచి రామేశ్వరానికి శనివారం ఉదయం 8.50 గంటలకు చేరుతుంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Malavika Nair: శర్వా.. బైకర్ ఫస్ట్ ల్యాప్ గ్లింప్స్ థియేటర్లలో స్క్రీనింగ్

Thaman: బాలకృష్ణ.. అఖండ 2: తాండవం బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం సర్వేపల్లి సిస్టర్స్

Dulquer : దుల్కర్ సల్మాన్.. కాంత నుంచి రాప్ ఆంథమ్ రేజ్ ఆఫ్ కాంత రిలీజ్

Rashmika: ది గర్ల్ ఫ్రెండ్ లో రశ్మికను రియలిస్టిక్ గా చూపించా : రాహుల్ రవీంద్రన్

Bhumi Shetty: ప్రశాంత్ వర్మ కాన్సెప్ట్ తో రాబోతున్న మహాకాళి చిత్రంలో భూమి శెట్టి లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments