Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారతీయ ముస్లింలు దేశభక్తులు.. నరేంద్ర మోడీ కితాబు

Webdunia
శుక్రవారం, 19 సెప్టెంబరు 2014 (21:08 IST)
ప్రధాని నరేంద్ర మోడీ భారతీయ ముస్లింలు దేశం కోసం ప్రాణాలు అర్పిస్తారని వారి ఉదాత్తతను ప్రపంచానికి చాటారు. శుక్రవారం ఓ అమెరికా టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... ‘‘భారతీయ ముస్లింలు... దేశం కోసమే జీవిస్తారు. అవసరమైతే దేశం కోసం ప్రాణాలర్పించేందుకూ వెనుకాడరు. భారత్‌కు ఎలాంటి నష్టం కలగకూడదని ప్రగాఢంగా విశ్వసిస్తారు’’ అని ఆయన అన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించేందుకూ వెనుకాడరనీ, భారత్‌కు ఎలాంటి నష్టం కలగకూడదని ప్రగాఢంగా విశ్వసిస్తారు’’ అని అన్నారు.
 
‘‘అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ భారతీయ ముస్లింల గురించి తప్పుగా అర్థం చేసుకుంటోంది. తమ ట్యూన్లకు అనుగుణంగా భారతీయ ముస్లింలు స్టెప్పులేస్తారని అనుకుంటోంది’’ అని కూడా మోడీ వ్యాఖ్యానించారు.
 
ఇస్లాం పేరిట జరుగుతున్న విశ్వవ్యాప్త పోరులో పాలుపంచుకోవాలని భారతీయ ముస్లింలకు పిలుపునిస్తూ, ఇటీవల అల్ ఖైదా చీఫ్ అయిమాన్ అల్ జవహరి విడుదల చేసిన వీడియోపై మోడీ ఈ మేరకు ఘాటుగా స్పందించారు. తద్వారా భారతీయ ముస్లింల గొప్పదనాన్ని, దేశభక్తిని ప్రపంచానికి తెలియజేశారు.

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

Show comments