Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్ సెలబ్రిటీలతో ప్రధాని మోడీ భేటీ.. ఎందుకంటే?

Webdunia
ఆదివారం, 20 అక్టోబరు 2019 (08:43 IST)
బాలీవుడ్ సెలెబ్రిటీలతో ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఢిల్లీలోని లోక్‌కల్యాణ్‌ మార్గ్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి బాలీవుడ్‌ నటులు అమీర్‌ఖాన్‌, షారూక్‌ ఖాన్‌, కంగనా రనౌత్ సహా అనేక సినీ సెలెబ్రిటీలు హాజరయ్యారు. 
 
ఈ కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ.. మహాత్మాగాంధీ సిద్ధాంతాలను విస్తృతం చేయడంలో సినీ, టీవీ పరిశ్రమకు చెందిన కొందరు సభ్యులు గొప్పగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. 
 
అనంతరం గాంధీ సిద్ధాంతాలను, అనుసరించిన మార్గాల గురించి చర్చించారు. అదేవిధంగా ఒకే సారి వాడే ప్లాస్టిక్‌(సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌) నిషేధంపై మద్దతు తెలిపినందుకు నటుడు అమీర్‌ఖాన్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. 
 
మహాత్మాగాంధీ సిద్ధాంతాలను ప్రజలకు తెలియజేసే విధంగా ప్రధాని మోడీ చేస్తున్న కృషిని అమీర్‌ఖాన్‌ అభినందించారు. ఇందుకోసం సృజనాత్మక వ్యక్తులుగా తాము కూడా చేయాల్సిన దాని కన్నా ఎక్కువగానే కృషి చేస్తామని అమీర్‌ అన్నారు. 
 
గాంధీ సిద్ధాంతాలను ప్రజలకు మళ్లీ పరిచయం చేయాలనే ఉద్దేశంతో అందరినీ ఒకే వేదికపై చేర్చినందుకు ప్రధానికి షారూఖ్‌ ఖాన్‌ ధన్యవాదాలు తెలిపారు. మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ప్రధాని బాలీవుడ్ ప్రముఖులతో సమావేశమయ్యారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mrunal Thakur: ఆన్‌లైన్‌లో ట్రెండ్ అవుతున్న మృణాల్ ఠాకూర్ పేరు.. ఎలాగంటే?

పగ, అసూయ, ప్రేమ కోణాలను చూపించే ప్రభుత్వం సారాయి దుకాణం

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు 9 కొత్త సీజన్ : కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. ఏంటవి?

Pawan: ఎన్టీఆర్, ఎంజీఆర్ ప్రేరణతో పవన్ కళ్యాణ్ పాత్రను రూపొందించా: జ్యోతి కృష్ణ

సయారా తో ఆడియెన్స్ ఆషికి రోజుల్ని తలుచుకుంటున్నారు : మహేష్ భట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments