Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో ఒకేసారి పట్టాలెక్కిన రెండు వందే భారత్ రైళ్లు

Webdunia
శుక్రవారం, 10 ఫిబ్రవరి 2023 (19:19 IST)
దేశంలో వందే భారత్ రైళ్లు పరుగులు పెడుతున్నాయి. ఇందులోభాగంగా, శుక్రవారం కూడా మరో రెండు వందే భారత్ రైళ్లు పట్టాలెక్కాయి. వీటిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఇప్పటికే ఎనిమిది వందే భారత్ రైళ్లు పలు మార్గాల్లో తిరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా రెండు వందే భారత్ రైళ్లను తిరిగి పట్టాలెక్కించారు. 
 
ఈ రెండు రైళ్లు ముంబై - షోలాపూర్, ముంబై - షిర్డీ మార్గాల్లో ప్రారంభించారు. ముంబై - షోలాపూర్ వందే భారత్ ట్రైన్ తొమ్మిదోది కాగా, ముంబై - షిర్డీ వందే భారత్ రైలు పదో రైలు. ఈ మార్గాల్లో ప్రయాణికులకు మరింత కనెక్టివిటీ కోసం ఈ రైళ్లను ప్రారంభించారు. ఈ రెండు రైళ్లను జెండా ఊపి ప్రారంభించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినల్‌కు వెళ్లారు. 
 
అలాగే, ముంబై మరోల్‌లో అల్జామియా - తుస్ - సైఫియా (ది సైఫీ అకాడమీ) కొత్త క్యాంపస్‌ను కూడా మోడీ ప్రారంభించారు. ఇది దావూదీ బోహ్రా కమ్యూనిటీ ప్రధాన విద్యా సంస్థగా వెలుగొందుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేగేశ్న కార్తీక్‌ను పెళ్లాడిన నటి అభినయ.. ఫోటోలు వైరల్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments