Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో ఒకేసారి పట్టాలెక్కిన రెండు వందే భారత్ రైళ్లు

Webdunia
శుక్రవారం, 10 ఫిబ్రవరి 2023 (19:19 IST)
దేశంలో వందే భారత్ రైళ్లు పరుగులు పెడుతున్నాయి. ఇందులోభాగంగా, శుక్రవారం కూడా మరో రెండు వందే భారత్ రైళ్లు పట్టాలెక్కాయి. వీటిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఇప్పటికే ఎనిమిది వందే భారత్ రైళ్లు పలు మార్గాల్లో తిరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా రెండు వందే భారత్ రైళ్లను తిరిగి పట్టాలెక్కించారు. 
 
ఈ రెండు రైళ్లు ముంబై - షోలాపూర్, ముంబై - షిర్డీ మార్గాల్లో ప్రారంభించారు. ముంబై - షోలాపూర్ వందే భారత్ ట్రైన్ తొమ్మిదోది కాగా, ముంబై - షిర్డీ వందే భారత్ రైలు పదో రైలు. ఈ మార్గాల్లో ప్రయాణికులకు మరింత కనెక్టివిటీ కోసం ఈ రైళ్లను ప్రారంభించారు. ఈ రెండు రైళ్లను జెండా ఊపి ప్రారంభించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినల్‌కు వెళ్లారు. 
 
అలాగే, ముంబై మరోల్‌లో అల్జామియా - తుస్ - సైఫియా (ది సైఫీ అకాడమీ) కొత్త క్యాంపస్‌ను కూడా మోడీ ప్రారంభించారు. ఇది దావూదీ బోహ్రా కమ్యూనిటీ ప్రధాన విద్యా సంస్థగా వెలుగొందుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nitin: హరిహరవీరమల్లు వాయిదా తో నితిన్ చిత్రం తమ్ముడు సిద్ధమైంది

Keneesha: రవి మోహన్ ప్రేయసి కెనీషా ఫ్రాన్సిస్ ప్రెగ్నెంటా?

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments