Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు రష్యాకు ప్రధాని నరేంద్ర మోడీ

ఠాగూర్
మంగళవారం, 22 అక్టోబరు 2024 (08:43 IST)
16వ బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రష్యాకు బయలుదేరి వెళ్లారు. ఈ పర్యటనలో ఆయన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో పాటు ఇతర సభ్య దేశాధినేతలతో ఆయన ద్వైపాక్షిక చర్చలు చేపట్టనున్నారు. అలాగే, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో కూడా భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. 
 
కజాన్ నగరంలో జరిగే ఈ 16వ బ్రిక్స్ సదస్సు ఈ దఫా అత్యంత కీలకంగా మారింది. రష్యా - ఉక్రెయిన్ దేశాల మధ్య గత యేడాదిన్నర కాలంగా సాగుతున్న యుద్ధంతో ఇజ్రాయేల్ - పాలస్తీనా  - ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం.. మధ్య ఆసియా దేశాల్లో నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ శిఖరాగ్ర సదస్సు జరుగబోతుంది. దీంతో ఈ దఫా బ్రిక్స్ సదస్సుకు అత్యంత ప్రాధాన్యత చేకూరింది. 
 
కాగా, బ్రిక్స్ సదస్సుకు హాజరు కావాలంటూ ప్రధాని మోడీకి రష్యా అధినేత పుతిన్ ప్రత్యేక ఆహ్వానం పంపిన విషయం తెల్సిందే. కాగా ఈ యేడాది ప్రధాని మోడీ రష్యాలో పర్యటించడం ఇది రెండోసారి. జూలైలో నెలలో మాస్కోలో జరిగిన 22వ భారత్ - రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశానికి కూడా ప్రధాని హాజరయ్యారు. ఆ పర్యటనలో పుతిన్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అంతేకాదు రష్యా అత్యున్నత పౌర పురస్కారం 'ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్ 'ను అందుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

కింగ్‌డమ్ విషయంలో పెద్ద ఛాలెంజ్ పరీక్షలో పాస్ అయ్యాము: సూర్యదేవర నాగ వంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments