అయోధ్య తీర్పు .. గెలుపోటముల అంశం కాదు : ప్రధాని మోడీ

Webdunia
శనివారం, 9 నవంబరు 2019 (12:00 IST)
అయోధ్య తీర్పు గెలుపోటలముల అంశంగా చూడొద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభిప్రాయపడ్డారు. వివాదాస్పద అయోధ్య అంశంపై సుప్రీంకోర్టు శనివారం చారిత్రాత్మక తీర్పును వెలువరించిన విషయం తెల్సిందే. ఈ తీర్పుపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందిస్తూ, అయోధ్య కేసులో సుప్రీం తీర్పును ఎవరి గెలుపోటముల అంశంగానూ చూడకూడదన్నారు. 
 
'అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. గత కొద్ది నెలలుగా ఈ వ్యాజ్యంపై సుప్రీం కోర్టు తరచుగా వాదనలు ఆలకించింది. ఈ సమయంలో సమాజంలోని అన్ని వర్గాలూ సద్భావనతో మెలిగేందుకు చేసిన ప్రయత్నాలు ప్రశంసనీయం. దేశంలో శాంతి, సామరస్యపూర్వక, సానుకూల వాతావరణాన్ని నెలకొల్పేందుకు.. సమాజంలోని అన్ని వర్గాలూ చేసిన కృషి స్వాగతించదగ్గది. కోర్టు తీర్పు తర్వాత కూడా మనమంతా కలిసి ఇదే సామరస్యాన్ని కొనసాగించాలి. అయోధ్యపై ఎలాంటి తీర్పు వచ్చినా అది ఎవరి గెలుపు, ఓటములకు సంబంధించిన విషయం కాదు' అని వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో మూవీకి చాలా అవార్డులు వస్తాయి - బీవీఎస్ రవి

Janhvi Swaroop: కౌశిక్ గోల్డ్, డైమండ్స్ ప్రచారకర్తగా జాన్వి స్వరూప్ ఘట్టమనేని

సంచలనంగా మారిన మన శంకరవర ప్రసాద్ గారు మీసాల పిల్ల సాంగ్

Mahesh Babu: మహేష్ బాబు .. బిజినెస్‌మ్యాన్ 4K ప్రింట్‌తో రీ-రిలీజ్

Kalivi Vanam: వనాలను రక్షించుకోవాలనే నేపథ్యంతో కలివి వనం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

తర్వాతి కథనం
Show comments