Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త శక్తిగా అవతరించాం - ఏ దేశానికీ వ్యతిరేకం కాదు: ప్రధాని మోడీ

Webdunia
గురువారం, 28 మార్చి 2019 (13:06 IST)
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (డీఆర్‌డీవో) మిషన్ శక్తి పేరుతో ఉపగ్రహ విధ్వంసక క్షిపణి (ఏ-శాట్)ను విజయవంతంగా ప్రయోగించింది. దీంతో అమెరికా, చైనా, రష్యా వంటి దేశాల సరసన భారత్ చేసింది. ఈ ప్రయోగం విజయవంతం కావడంపై ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'మిషన్‌ శక్తి'తో భారత్‌ కొత్త చరిత్ర లిఖించిందన్నారు. ఉపగ్రహ విధ్వంసక క్షిపణి (ఏశాట్‌) ప్రయోగంతో అంతరిక్షంలోనూ తిరుగులేని శక్తిగా అవతరించిందని చెప్పారు. ఆ క్షిపణి కేవలం మూడు నిమిషాల్లో దిగువ కక్ష్యలోని ఓ ఉపగ్రహాన్ని కూల్చివేసిందని వెల్లడించారు. ఈ విజయంతో అంతరిక్ష సామర్థ్యంలో అమెరికా, రష్యా, భారత్‌, చైనా సరసన నిలిచామని వెల్లడించారు.
 
'భూమి, నీరు, గాలిలోనే కాదు ఇప్పుడు అంతరిక్షంలోనూ మనను మనం రక్షించుకోగలం. ఇది మనమంతా గర్వించాల్సిన క్షణం' అన్నారు. ఏ-శాట్‌ ఏ దేశానికీ వ్యతిరేకం కాదని, ఆత్మరక్షణకు మాత్రమేనని తెలిపారు. ఏశాట్‌ ప్రయోగం అంతర్జాతీయ చట్టాలు, ఒప్పందాలను ఉల్లంఘించదని స్పష్టం చేశారు. భారత్‌ ఎలాంటి లక్ష్యాలనైనా సాధించగలదని మరోమారు నిరూపించిందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ (video)

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments