Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాడ్జీల్లో ఎంజాయ్ కోసమైతే గోవాకు రావొద్దు : సీఎం ప్రమోద్ సావంత్

Webdunia
శుక్రవారం, 15 మే 2020 (17:49 IST)
దేశాన్ని కరోనా వైరస్ మహమ్మారి ఇప్పట్లో వదిలిపెట్టేలా లేదు. అయినప్పటికీ ఈ వైరస్ నుంచి విముక్తి పొందిన రాష్ట్రాల్లో గోవా ఒకటి. కరోనాను బాగా కట్టడి చేసిన రాష్ట్రంగా గోవా గుర్తింపు పొందింది. దీంతో గోవాలో పర్యాటకుల సందర్శనకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అలాగే, రెస్టారెంట్లు, బార్లు తెరుచుకునేందుకు కూడా పరిమిత సంఖ్యలో అనుమతి ఇచ్చింది.
 
ఇదే అంశంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ స్పందిస్తూ, సరదాగా గడపడానికి, లాడ్జీల్లో ఎంజాయ్ చేసేందుకు అయితే తమ రాష్ట్రానికి రావొద్దని కోరారు. అలా వచ్చినవారిని తప్పనిసరిగా 14 రోజులపాటు క్వారైంటైన్‌కు తరలిస్తామని హెచ్చరించారు. 
 
న్యూఢిల్లీ నుంచి తిరువనంతపురం వెళ్తున్న ప్రత్యేక రైలులో 720 మంది మార్గావ్ వరకు టికెట్లు బుక్‌చేసుకున్నారని, వారిలో గోవాకు చెందినవారు ఒక్కరు కూడా లేరనే విషయాన్ని గ్రహించినట్టు తెలిపారు. 
 
ఢిల్లీలో ఈ రోజు బయల్దేరిన ప్రత్యేక రైలు రేపు తిరువనంతపురం చేరుకోనుంది. మార్గావ్‌లో రైలు ఆపకూడదని తాము ఇప్పటికే రైల్వేశాఖను కోరామని తెలిపారు. ఇలా వచ్చేవారిలో గోవా పౌరులతోపాటు, రాష్ట్రానికి చెందనివారిని కూడా హోం క్వారంటైన్‌లో ఉంచుతామని ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ నిర్మాణ కార్మికులకు వేతనాలు పెంచిన తెలుగు ఫిల్మ్ చాంబర్

Balakrishna: బాలకృష్ణకు సత్కారం.. సీఎం సహాయ నిధికి రూ.50 లక్షల విరాళం- ప్రముఖుల కితాబు (video)

లోకేష్ కనగరాజ్ హీరోగా రచితా రామ్ నాయిక గా చిత్రం..

పుష్పక విమానం తరహాలో ఉఫ్ఫ్ యే సియాపా రాబోతోంది

OG record: పవన్ కళ్యాణ్ దే కాల్ హిమ్ ఓజీ అమెరికాలో రికార్డ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments