Webdunia - Bharat's app for daily news and videos

Install App

హరిద్వార్ వెళ్లి వస్తుండగా ఘోరం.. 10 మంది మృత్యువాత

Webdunia
గురువారం, 23 జూన్ 2022 (09:44 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారణం జరిగింది. హరిద్వార్ వెళ్లి వస్తున్న యాత్రికుల వ్యాను ఒకటి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పది మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రమాదం ఫిలిబిత్‌లోని గజ్రౌలా పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో జరిగింది. 
 
కొంతమంది భక్తులతో హరిద్వార్ వెళ్లిన డీసీఎం వ్యాను దైవదర్శనం ముగించుకుని తిరిగి తమ సొంతూర్లకు బయలుదేరారు. డ్రైవర్‌తో సహా భక్తులంతా నిద్రమత్తులో ఉండగా వేగంగా వస్తున్న వ్యాను రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టి, హైవేపై బోల్తాపడింది. ఈ ఘటనలో పది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 
 
తీవ్రంగా గాయపడిన ఏడుగురిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మృత్తుల్లో ఎక్కువ మంది లక్నోకు చెందినవారే కావడం గమనార్హం. ప్రమాదానికి డ్రైవర్ నిద్రమత్తే కారణమని తెలుస్తుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతేదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments