Webdunia - Bharat's app for daily news and videos

Install App

హరిద్వార్ వెళ్లి వస్తుండగా ఘోరం.. 10 మంది మృత్యువాత

Webdunia
గురువారం, 23 జూన్ 2022 (09:44 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారణం జరిగింది. హరిద్వార్ వెళ్లి వస్తున్న యాత్రికుల వ్యాను ఒకటి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పది మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రమాదం ఫిలిబిత్‌లోని గజ్రౌలా పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో జరిగింది. 
 
కొంతమంది భక్తులతో హరిద్వార్ వెళ్లిన డీసీఎం వ్యాను దైవదర్శనం ముగించుకుని తిరిగి తమ సొంతూర్లకు బయలుదేరారు. డ్రైవర్‌తో సహా భక్తులంతా నిద్రమత్తులో ఉండగా వేగంగా వస్తున్న వ్యాను రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టి, హైవేపై బోల్తాపడింది. ఈ ఘటనలో పది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 
 
తీవ్రంగా గాయపడిన ఏడుగురిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మృత్తుల్లో ఎక్కువ మంది లక్నోకు చెందినవారే కావడం గమనార్హం. ప్రమాదానికి డ్రైవర్ నిద్రమత్తే కారణమని తెలుస్తుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతేదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharwanand: తమన్నా ని హీరోయిన్ అని పిలవడం ఇష్టం లేదు : శర్వానంద్

Maheshbabu: వెకేషన్ నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చిన మహేష్ బాబు

ఎంతో మందితో కలిసి పని చేసినా.. కొంతమందితోనే ప్రత్యేక అనుబంధం : తమన్నా

Nani: వైలెన్స్ సినిమాలున్న దేశాల్లో క్రైమ్ రేట్ తక్కువ, కానీ ఇక్కడ మన బుద్ధి సరిగ్గా లేదు : నాని

Dhanush: శేఖర్ కమ్ముల కుబేర లో ధనుష్ మాస్ సాంగ్ డేట్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

తర్వాతి కథనం
Show comments