Webdunia - Bharat's app for daily news and videos

Install App

16 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. 35మంది అరెస్ట్

Webdunia
గురువారం, 18 నవంబరు 2021 (17:43 IST)
ఉత్తరప్రదేశ్‌లో 16 ఏళ్ల బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం.. ఆపై హత్యకు సంబంధించిన కేసులో పోలీసులు 35మందిని అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. యూపీలోని పిలిభిత్ జిల్లా బర్ఖెరా సమీపంలోని ఓ గ్రామంలో గత శనివారం ఈ ఘటన జరిగింది. సైకిల్‌పై స్కూలుకు వెళ్లిన బాలిక శనివారం సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో కంగారు పడిన తల్లిదండ్రులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించారు. 
 
రాత్రి పదకొండు గంటల సమయంలో ఇంటి నుంచి సుమారు అర కిలోమీటరు దూరంలో అర్ధ నగ్నంగా పడి ఉన్న బాలిక మృతదేహాన్ని గుర్తించారు. ఆ పరిసరాల్లో సైకిల్, స్కూల్‌ బ్యాగ్, బీరు బాటిళ్లు కనిపించాయి. తమ బిడ్డను గుర్తు తెలియని వ్యక్తులు గ్యాంగ్ రేప్‌ చేసి చంపేశాని ఆ బాలిక కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. 
 
ఈ ఘటన జరిగి ఐదు రోజులు గడిచినా.. నిందితులను పట్టుకోలేదని.. తమ బిడ్డకు త్వరగా న్యాయం జరగాలంటే కేసు సీబీఐకి అప్పగించాలని కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై ఏడీజీ అవినాశ్ చంద్ర స్పందిస్తూ.. ఈ కేసును మొత్తం 12 టీమ్‌లు ఇన్వెస్టిగేట్‌ చేస్తున్నాయని తెలిపారు. ఇప్పటికే 35 మందిని అరెస్ట్ చేయగా, మరో 10 మందిని ప్రశ్నిస్తున్నామన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం