Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలిత ఆస్తులను జాతికి అంకితం చేయాలి.. మద్రాస్ హైకోర్టులో పిల్.. వారసులు లేరట..

దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై ఇంకా మిస్టరీ వీడని నేపథ్యంలో.. ఆమె ఆస్తులపై ప్రస్తుతం చర్చ మొదలైంది. జయలలి ఆస్తులను జాతీయం చేయాలని కోరుతూ మద్రాస్ హైకోర్టులో ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ మేరకు

Webdunia
బుధవారం, 11 జనవరి 2017 (15:42 IST)
దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై ఇంకా మిస్టరీ వీడని నేపథ్యంలో.. ఆమె ఆస్తులపై ప్రస్తుతం చర్చ మొదలైంది. జయలలి ఆస్తులను జాతీయం చేయాలని కోరుతూ మద్రాస్ హైకోర్టులో ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలివ్వాలని తమిళనాడుకు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ పిటిషన్‌ వేసింది. 
 
డిసెంబర్‌ 5న మృతిచెందిన జయలలితకు వారసులెవరూ లేని కారణంగా జయలలిత ఆస్తులను జాతీయం చేయాలని పిటిషన్‌లో కోరారు. ఈ వ్యవహారం అంతా నిర్వహించేందుకు విశ్రాంత న్యాయమూర్తిని నియమించాలని పిటిషనర్ కోరారు. 
 
ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుని వాటి ద్వారా వచ్చిన ఆదాయాన్ని ప్రజల కోసం ఖర్చుచేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ మేరకు జయ ఆస్తుల వివరాలను పొందుపరుస్తూ అఫిడవిట్‌ను కూడాపిటిషన్‌తో పాటు దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ గురువారం విచారణకు వచ్చే అవకాశముంది.
 
కాగా గతంలో హైదరాబాద్‌లోని జయలలిత ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకునేలా ఆదేశాలివ్వాలంటూ దాఖలైన పిటీషన్‌పై హైకోర్టు సీరియస్ అయిన సంగతి తెలిసిందే. వారసులు లేనందున జయ ఆస్తులను తెలంగాణ సర్కారు స్వాధీనం చేసుకోవాలని గరీబ్ గైడ్ ఇంటర్నేషనల్ సంస్ద న్యాయస్థానాన్ని కోరింది. దీనిపై విచారించిన కోర్టు జయలలిత సోదరుడు ఉండగా.. హిందూ చట్టం ప్రకారం వారసులు లేరని మీరెలా అంటారని పిటీషనర్‌ను ప్రశ్నించింది. 
 
ప్రచారం కోసమే పిటీషన్ దాఖలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ పిటిషనర్‌కు లక్ష రూపాయల జరిమానా విధించింది. ఈ నేపథ్యంలో జయ ఆస్తులపై తమిళనాడు హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుందోనని అన్నాడీఎంకే కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments