జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్... వయనాడ్‌లో కూడా...

ఠాగూర్
బుధవారం, 13 నవంబరు 2024 (09:15 IST)
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా తొలి విడత పోలింగ్ బుధవారం ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైంది. ఈ రాష్ట్రంలోని మొత్తం 81 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా 43 స్థానాలకు బుధవారం పోలింగ్ జరుగుతుంది. అలాగే, కేరళ రాష్ట్రంలోని వయనాడ్ లోక్‌సభతో పాటు.. పది రాష్ట్రాల్లోని 31 అసెంబ్లీ స్థానాలకు కూడా ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. 
 
అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాజస్థాన్‌లో 7, పశ్చిమ బెంగాల్లో 6, అస్సాంలో 5, బీహార్‌లో 4, కేరళలో 3, మధ్యప్రదేశ్‌లో 2, మేఘాలయ, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటకలో ఒక్కో సీటుకు పోలింగ్ జరుగుతోంది. కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీ వాద్రా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
 
జార్ఖండ్‌తో పాటు ఉప ఎన్నికల పోలింగ్‌కు ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. కట్టుదిట్టమైన భద్రతను మోహరించింది. కాగా జార్కండ్‌లో రెండో దశ ఎన్నికలు నవంబరు 20వ తేదీన జరగనున్నాయి. నవంబరు 23వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. కాగా 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం పార్టీ అత్యధికంగా 30 సీట్లు గెలుచుకుంది. బీజేపీ 25 స్థానాలకు పరిమితమైంది. జేఎంఎం - కాంగ్రెస్ - ఆర్జేడీ కూటమి మొత్తం 47 సీట్లతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raviteja: రవితేజ, డింపుల్ హయతి.. భర్త మహాశయులకు విజ్ఞప్తి నుంచి మెలోడీ సాంగ్

ఎవరు కొత్త తరహా సినిమా చేసినా ప్రోత్సాహించాలి, లేకుంటే ముందడుగు వేయలేరు : కార్తి

మాకు మనవళ్ళు పుట్టినా నాగార్జున అలానే ఉన్నారు.. యాంటీ ఏజింగ్ టెస్టులు చేయాలి...

విదు, ప్రీతి అస్రాని మ‌ధ్య కెమిస్ట్రీ 29 సినిమాకు ప్ర‌ధానాక‌ర్ష‌ణ

మగాళ్లను మొక్కు కుంటూ కాదు తొక్కు కుంటూ పోతం.. పురుష కొత్త పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీజనల్ ఫ్రూట్ రేగు పండ్లు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఫ్యాషన్‌ను ప్రముఖమైనదిగా నడిపించే బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

అధునాతన క్యాన్సర్ చికిత్సకై టాటా మెమోరియల్ ఎసిటిఆర్ఇసితో కోటక్ మహీంద్రా భాగస్వామ్యం

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

పది లక్షల మంది పిల్లల్లో ప్రకటనల అక్షరాస్యతను పెంపొందించే లక్ష్యం

తర్వాతి కథనం
Show comments