Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాకీ తీర్చమన్నందుకు తుపాకీతో కాల్చి చంపేశాడు.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 13 జనవరి 2016 (06:48 IST)
చిన్నపాటి విషయాలకే కొందరు క్షణికావేశానికి లోనవుతున్నారు. బాకీ డబ్బు చెల్లించమని అడిగినందుకు ఓ వ్యక్తిని మరో వ్యక్తి దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన హిమాచల్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకెళితే భటోలీ గ్రామానికి చెందిన ఉమేశ్‌శర్మ పఠాన్‌కోట్‌-జలంధర్‌ జాతీయ రహదారిపై ఉన్న ఓ పెట్రోల్‌ బంక్‌లో సేల్స్‌ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. రుపీందర్‌ అనే వ్యక్తి తరచూ బంక్‌కు వస్తూ పెట్రోల్‌ పోయించుకుని డబ్బు చెల్లించకుండా వెళ్లేవాడు. 
 
ఈ నేపథ్యంలో తాజాగా రుపీందర్‌ పెట్రోల్‌ కోసం వచ్చినప్పుడు పాత బాకీ తీరిస్తేగానీ ఇంధనం పోయనని మొండికేశాడు. దీంతో రుపీందర్‌ ఉమేశ్‌ని తుపాకీతో కాల్చి చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని సమీపంలోని ముళ్లపొదల్లో పడేశాడు. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డ్‌ అవడంతో ఫుటేజ్‌ ఆధారంగా పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేశారు.

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments