Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలా చేస్తే లీటర్ పెట్రోల్ రూ.15కే విక్రయం : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

Webdunia
గురువారం, 6 జులై 2023 (10:51 IST)
తాను చెప్పిన సృజనాత్మక ఫార్ములాను పాటిస్తే దేశంలో లీటర్ పెట్రోల్‌ను రూ.15 కే విక్రయించవచ్చని కేంద్ర జాతీయ రహదారుల శాఖామంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. దేశంలో రవాణా అవసరాలకు సగటున 60 శాతం ఇథనాల్, 40 శాతం విద్యుత్ వినియోగిస్తే పెట్రోలు లీటరు ధర రూ.15కు చేరుకుంటుందని, అంతిమంగా ఇది సామాన్యులకు లాభిస్తుందన్నారు. 
 
రాజస్థాన్ రాష్ట్రంలోని ప్రతాప్‌‍గఢ్ నగరంలో జరిగిన ఓ సభలో మంత్రి గడ్కరీ పాల్గొని ప్రసంగిస్తూ, రైతులు కేవలం అన్నదాతలే కాదు, శక్తిదాతలు కూడా కాగలరని మా ప్రభుత్వం నమ్ముతోంది. త్వరలో దేశంలోని వాహనాలు 60 శాతం ఇథనాల్ కలిగిన ఇంధనంతో పరుగులు పెడతాయి. మరో 40 శాతం రవాణా ఖర్చుకు విద్యుత్ కూడా జతచేస్తే దేశంలో పెట్రోల్ సగటున లీటరు రూ.15కే లభిస్తుంది. ఇది సామాన్యులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది అని సెలవిచ్చారు.
 
ఇథనాల్ ఆధారిత ఇంధనంతో కాలుష్యం తగ్గడమేకాకుండా ఇంధన దిగుమతులు కూడా తగ్గుతాయని చెప్పారు. దిగుమతులపై ప్రస్తుతం ఖర్చు చేస్తున్న రూ.16 లక్షల కోట్లను రైతు శ్రేయస్సు కోసం వినియోగించవచ్చన్నారు. అంతకుమునుపు, నితిన్ గడ్కరీ ప్రతాప్‌గఢ్‌లో రూ.5600 కోట్లతో చేపట్టనున్న 11 జాతీయ రహదారుల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'పుష్ప-2' దర్శకుడు ఇంటిలో ఐటీ తనిఖీలు!

Rashmika Mandanna: రష్మికకు కాలు బెణికింది.. వీల్ ఛైర్‌‌పై నడవలేని స్థితిలో..? (video)

మహేష్ బాబు, జాన్ అబ్రహం, ప్రియాంక చోప్రా కాంబినేషన్ షురూ

హైలెస్సో హైలెస్సా అంటూ పాడుకుంటున్న నాగ చైతన్య, సాయి పల్లవి

చిలుకూర్ బాలాజీని దర్శించుకున్న ప్రియాంకా చోప్రా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీవనశైలిలో మార్పులతో గుండెజబ్బులకు దూరం!!

మహిళలకు మేలు చేసే మల్లె పువ్వులు.. అందానికే కాదు.. ఆరోగ్యానికి కూడా..?

యునిసెఫ్‌తో కలిసి తిరుపతిలో 'ఆరోగ్య యోగ యాత్ర' ఫాగ్సి జాతీయ ప్రచారం

Winter Stroke శీతాకాలంలో బ్రెయిన్ స్ట్రోక్, నివారించే మార్గాలు

పాండ్స్ యూత్‌ఫుల్ మిరాకిల్ రేంజ్ లాంచ్

తర్వాతి కథనం
Show comments