Webdunia - Bharat's app for daily news and videos

Install App

బుచ్చిరెడ్డిపాళెంలో ఘరానా మోసం : రూ.400 పెట్రోల్ కొట్టిస్తే అర లీటరు మాత్రమే వచ్చింది...

ఠాగూర్
గురువారం, 3 జులై 2025 (17:42 IST)
ఏపీలోని నెల్లూరు జిల్లాలోని ఒక పెట్రోల్ బంకులో సాగుతున్న ఘరానా మోసం ఒకటి వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని బుచ్చిరెడ్డిపాళెయంలోని ఓ పెట్రోల్ బంకులో వాహనదారుడు తన బైకుకు రూ.400కు పెట్రోల్ పోయించగా, కేవలం అర లీటరు మాత్రమే వచ్చింది. దీంతో వాహనదారుడు అవాక్కయ్యాడు.
 
ఓ వ్యక్తి తన బైకులో పెట్రోల్ కొట్టించిన తర్వాత ఇంజిన్‌లో తేడా రావడంతో అనుమానం వచ్చింది. పెట్రోల్ తక్కువగా వచ్చిందేమోనని భావించి, ట్యాంకులోని ఇంధనాన్ని ఓ బకెట్‌లోకి తీసి చూడటంతో అసలు మోసం బయటపడింది. రూ.400 చెల్లిస్తే కనీసం అర లీటరు పెట్రోల్ కూడా రాకపోవడంతో తీవ్ర ఆవేదన చెందుతూ పెట్రోల్ బంక్ సిబ్బందిని నిలదీయగా, వారు సరైన సమాధానం ఇవ్వలేదు. కల్లిబొల్లి మాటలతో సమాధానం దాటవేసే ప్రయత్నం చేశాడు. దీంతో పెట్రోల్ బంకు సిబ్బందికి, వాహనదారుడుకి వాగ్వాదం జరిగింది. 
 
జిల్లాలలో సంబంధిత శాఖ అధికారుల పర్యవేక్షణ కొరవడటం వల్లే బంకుల నిర్వాహకులు ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారని స్థానిక వాహనదారులు ఆరోపిస్తున్నారు. ఇలా మోసాలకు పాల్పడుతున్న బంకులపై కఠిన చర్యలు తీసుకోవాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 3లో పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ, తన డబ్బునంతా కపిల్ శర్మకు అప్పగించారా?

Natti kumar: ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ కలిసి సినీ కార్మికులను మోసం చేశారు : నట్టి కుమార్ ఫైర్

Govinda-Sunita divorce: గోవింద- సునీత విడాకులు తీసుకోలేదు.. మేనేజర్

వారం ముందుగానే థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న లిటిల్ హార్ట్స్

సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా.. జటాధర నుంచి దివ్య ఖోస్లా ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments