Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెట్రో​ ధరలు మరింత పైపైకి

Webdunia
బుధవారం, 25 సెప్టెంబరు 2019 (06:25 IST)
చమురు సంక్షోభంతో.. దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర నేడు 22 పైసలు పెరిగి.. రూ.74.13కి చేరింది. ముంబయి, హైదరాబాద్ నగరాల్లో లీటర్​ పెట్రోల్​ ధర ఏకంగా రూ.80కి చేరువలో ఉంది.

అంతర్జాతీయంగా పెరుగుతున్న చమురు ధరల నేపథ్యంలో వరుసగా ఎనిమిదో రోజు దేశీయంగా పెట్రోల్​, డీజిల్​ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దేశ రాజధాని దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర నేడు 22 పైసలు పెరిగి.. రూ.74.13కి చేరింది. లీటర్ డీజిల్​ ధర 14 పైసలు పెరిగింది.

ప్రస్తుతం రూ.67.07 వద్ద ఉంది. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో లీటర్​ పెట్రోల్ ధర రూ.80కి చేరువలో ఉండగా.. లీటర్​ డీజిల్​ ధర రూ.70 దాటింది. నరగాల వారీగా పెట్రో ధరలు.. నగరం పెట్రోల్(లీ) డీజిల్​(లీ) ముంబయి రూ.79.77 రూ.70.34 హైదరాబాద్ రూ.78.77 రూ.73.08 చెన్నై రూ.77.03 రూ.70.88 కోల్​కతా రూ.76.79 రూ.69.46.

ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తి సంస్థ అయిన.. ఆరాంకో చమురు శుద్ధి కేంద్రంపై హౌతీ తిరుగుబాటుదార్లు చేసిన డ్రోన్​ దాడితో అంతర్జాతీయంగా చమురు సంక్షోభం మొదలైంది. ఈ దాడితో ప్రపంచవ్యాప్తంగా 5శాతం ఉత్పత్తి తగ్గి.. ముడి చమురు ధరలు వరుసగా పెరుగుతూ వస్తున్నాయి.

నెలాఖరుకు ఉత్పత్తిని పునరుద్ధరిస్తామని ఆరాంకో ప్రతినిధులు చెబుతున్నా చమురు ధరలపై అనిశ్చితులు తొలగటం లేదు.

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments