Webdunia - Bharat's app for daily news and videos

Install App

పార్లమెంట్ చేసిన చట్టం రాజ్యాంగ వ్యతిరేకం ఎలా అవుతుంది : చీఫ్ జస్టీస్

Webdunia
గురువారం, 9 జనవరి 2020 (14:33 IST)
దేశ పార్లమెంట్ చేసిన చట్టం రాజ్యాంగ వ్యతిరేకం ఎలా అవుతుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బోబ్డే వ్యాఖ్యానించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం రూపొందించిన పౌరసత్వ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతా దాఖలైన పిటిషన్‌ను విచారించిన కోర్టు పై విధంగా వ్యాఖ్యానించింది. 
 
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చాలా సంక్లిష్ట‌మైన ప‌రిస్థితులు నెలకొనివున్నాయని, ఇలాంటి నేప‌థ్యంలో ఈ తరహా పిటిష‌న్లు ఏమీ చేయ‌లేవ‌న్నారు. అయితే దేశ‌వ్యాప్తంగా హింసాత్మ‌క అల్ల‌ర్లు ఆగితేనే, పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టం వ‌ర్తింపు అంశంపై పిటిష‌న్లు స్వీక‌రిస్తామ‌ని చీఫ్ జ‌స్టిస్ తెలిపారు. 
 
అసలు పార్ల‌మెంట్‌లో పాసైన ఓ చ‌ట్టాన్ని రాజ్యాంగ వ్య‌తిరేక‌మ‌ని ఎలా ప్ర‌క‌టిస్తార‌ని చీఫ్ జ‌స్టిస్ ప్ర‌శ్నించారు. ప్ర‌స్తుతం శాంతిని నెల‌కొల్పేందుకే మ‌నం ప్ర‌య‌త్నించాల‌ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సలహా ఇచ్చారు. 
 
కాగా, సీఏఏను రాజ్యాంగ వ్య‌తిరేక‌మ‌ని ప్ర‌క‌టించాల‌ని న్యాయ‌వాది వీన‌త్ ధండా త‌న పిటిష‌న్‌లో కోరారు. సీఏఏపై దుష్ ప్ర‌చారం నిర్వ‌హిస్తున్న కార్య‌క‌ర్త‌లు, విద్యార్థులు, మీడియా సంస్థ‌ల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments