Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి శశిథరూర్ ... సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం

తాజాగా వెల్లడైన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ శ్రేణుల్లో నైరాశ్యం నెలకొంది. ముఖ్యంగా ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఆ పార్టీ చిత్తుగా ఓడిపోవడాన్ని ఏమాత్రం జీర్ణించుకోలేక పోత

Webdunia
మంగళవారం, 14 మార్చి 2017 (11:42 IST)
తాజాగా వెల్లడైన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ శ్రేణుల్లో నైరాశ్యం నెలకొంది. ముఖ్యంగా ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఆ పార్టీ చిత్తుగా ఓడిపోవడాన్ని ఏమాత్రం జీర్ణించుకోలేక పోతున్నారు. అలాగే, మణిపూర్, గోవాల్లో కూడా బొటాబొటి మెజార్టీనే వచ్చింది. దీంతో ఈ రెండు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని పరిస్థితి. 
 
ఈనేపథ్యంలో 2019లో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా తిరువనంతపురం ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి శశిథరూర్‌ను ప్రకటించాలంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారాన్ని కేరళ తిరువనంతపురానికి చెందిన ఒక వ్యక్తి ప్రారంభించారు. 
 
శశిథరూర్ అత్యున్నత విద్యార్హతలు కలిగిన వ్యక్తి అని... జాతీయ, అంతర్జాతీయ అంశాల్లో ఆయనకు ఉన్న పరిజ్ఞానం అమోఘమని... ప్రపంచ స్థాయి నాయకులతో ఆయనకు మంచి సంబంధాలున్నాయని సదరు వ్యక్తి గుర్తు చేస్తున్నారు. దేశ ప్రజలలో కూడా శశిథరూర్‌కు మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. శశిథరూర్ ప్రధానమంత్రి అభ్యర్థిత్వానికి ఇప్పటివరకు 6,821 మంది నెటిజన్లు మద్దతు పలికారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

డ్రగ్స్‌కు వ్యతిరేకంగా రూపొందిన ఫైటర్ శివ టీజర్ ఆవిష్కరించిన అశ్వనీదత్

ధర్మశాల వంటి ఒరిజనల్ లొకేషన్ లో పరదా చిత్రించాం : డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల

Madhu Shalini: మా అమ్మానాన్న లవ్ స్టోరీ కన్యాకుమారిలానే వుంటుంది : మధు షాలిని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments