Webdunia - Bharat's app for daily news and videos

Install App

2022 రాష్ట్రపతి ఎన్నికల అభ్యర్థిగా పవార్?

Webdunia
మంగళవారం, 7 జనవరి 2020 (05:46 IST)
జాతీయ రాజకీయాల్లో సీనియర్ నేత, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పేరును రాష్ట్రపతి పదవికి అన్ని పార్టీలు పరిశీలించాలన్నారు శివసేన ముఖ్య నాయకుడు సంజయ్ రౌత్.

2022లో రాష్ట్రపతి ఎన్నికల్లో పవార్ పేరును ప్రతిపాదించాలని పిలుపునిచ్చారు రౌత్. రాష్ట్రపతి పదవి కోసం ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పేరును ప్రతిపాదించే అంశాన్ని అన్ని రాజకీయ పార్టీలు పరిశీలించాలని కోరారు శివసేన ముఖ్య నేత సంజయ్ రౌత్.

2022లో రాష్ట్రపతి ఎన్నికలు జరిగేనాటికి ఆ పదవిని ఎవరు చేపట్టాలో నిర్ణయించేంత సంఖ్యాబలం తమకు ఉంటుందని ధీమా వ్యక్తంచేశారు రౌత్.
 
ఉద్ధవ్ థాకరేతో అశోక్ గెహ్లాట్ సమావేశం 
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఇవాళ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేతో సమావేశం అయ్యారు. ముంబైలోని థాకరే నివాసం మాతోశ్రీలో ఈ సమావేశం జరిగింది. మర్యాదపూర్వకంగానే థాకరేని కలిసినట్టు గెహ్లాట్ వెల్లడించారు.

‘‘మా రాష్ట్రాల అభివృద్ధి కోసం ఏమేం చేయగలమన్న దానిపై చర్చించాం. ఏయే విధానాలను రూపొందించాలన్న దానిపై సమాలోచనలు జరిపాం’’ అని గెహ్లాట్ పేర్కొన్నారు. మహారాష్ట్రలో ఏర్పాటైన కూటమి ప్రభుత్వం ఐదేళ్ల పాటు పూర్తికాలం కొనసాగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాగా ఇద్దరు సీఎంలతో పాటు థాకరే కుమారుడు ఆదిత్య థాకరే కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తీపి మొక్కజొన్న తింటే?

తర్వాతి కథనం
Show comments