Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్యాసింజర్ రైలును 5 కిమీ వరకు తోసిన ప్రయాణికులు.. ఎక్కడ... ఎపుడు!

Webdunia
శుక్రవారం, 31 జులై 2015 (17:43 IST)
సాధారణంగా నడి రోడ్డుపై బస్సులు, లారీలు, కార్లు, చిన్నపాటి రవాణా వాహనాలు ఆగిపోవడం చూస్తుంటాం. అలాగే, ద్విచక్రవాహనాలు కూడా రోడ్లపై మొరాయిస్తుంటాయి. కానీ, బుల్లెట్ రైళ్ళ గురించి మాట్లాడుకుంటున్న ప్రస్తుత రోజుల్లో... ఓ రైలు పట్టాలపై ఆగిపోయినట్టుగా కానీ, అలాంటి సందర్భం కానీ వినడం లేదా చూడటం జరిగివుండదు.
 
 
కానీ, మన దేశ చరిత్రలోనే ఈ తరహా సంఘటన ఒకటి తాజాగా చోటుచేసుకుంది. అదీ కూడా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకృష్ణుని జన్మస్థానమైన మధురలో. మధుర - బృందావన్‌ల మధ్య నడిచే రాధారాణి ప్యాసింజర్ రైలుకు ఈ పరిస్థితి ఎదురైంది. 
 
ఈ రైలింజన్‌లో ఏర్పడిన సాంకేతికలోపం కారణంగా మధుర ప్రాంతంలో రైలు ఆగిపోయింది. డ్రైవర్ పలుమార్లు ప్రయత్నించినా ఇంజిన్ స్టార్ట్ కాలేదు. దీంతో ప్రయాణికులు దిగి రైలును నెట్టే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ.. స్టార్ట్ కాకపోవడంతో రైలును ఏకంగా ఐదు కిలోమీటర్ల మేరకు ప్రయాణికులు నెట్టుకుంటూ వెళ్లారు. ఇది చూసిన అందరూ అవాక్కయ్యారు. ఈ తరహా సంఘటన జరగడం దేశంలో ఇదేతొలిసారి.

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments