Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంపీల మనవలకూ ఉచిత వైద్య సౌకర్యం.. పార్లమెంటరీ ప్యానెల్ సిఫార్సు.. తోసిపుచ్చిన కేంద్రం!

Webdunia
శనివారం, 4 జులై 2015 (09:48 IST)
ప్రస్తుత పరిస్థితుల్లో ఎంపీ యోగి ఆదిత్యనాథ్ కమిటీ సిఫార్సుల మేరకు సిట్టింగ్ ఎంపీలకు వందశాతం వేతనభత్యాలను పెంచలేమని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలశాఖామంత్రి తేల్చిచెప్పినట్టు ప్రభుత్వ వర్గాల సమాచారం. ఎంపీల జీతభత్యాల సవరణ కోసం బీజేపీ ఎంపీ యోగి ఆదిత్యనాథ్‌ నేతృత్వంలో పార్లమెంటరీ ప్యానెల్‌ను ఏర్పాటుచేయడం జరిగింది. 
 
ఈ కమిటీ అన్ని అంశాలను పరిశీలించి ఒక నివేదికను సమర్పించింది. అయితే, ఈ కమిటీ చేసిన సిఫారసులను చూసి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికారులు షాక్‌కు గురయ్యారట. ఆ తర్వాత నివేదికను నిశితంగా పరిశీలించి.... తమ అభిప్రాయాలను జతచేస్తూ తిరిగి ఈ కమిటీకే జూన్‌ 24న పంపించినట్ల అధికారవర్గాలు తెలిపాయి. కమిటీ చేసిన పలు సిఫారసులను పరిశీలించలేమని మంత్రిత్వశాఖ పేర్కొన్నట్లుగా ఆ వర్గాలు స్పష్టంచేశాయి. 
 
ఎంపీల రోజువారి భత్యాన్ని రూ.2 వేల నుంచి రూ.5 వేలకు పెంచడం, విమాన ప్రయాణాల సంఖ్యను 34 నుంచి 48కు, మాజీ ఎంపీలకూ ఉచిత విమాన సౌకర్యం, పెళ్ళిళ్లు జరిగిన తమ పిల్లల, మనవలకు వైద్య సౌకర్యం కల్పించాలని ఇలా అనేక డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించే స్థితిలో లేదని ఆ వర్గాలు వెల్లడించాయి.

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments