ఉభయ సభలను కుదిపేస్తున్న ఆదానీ ఎపిసోడ్ - ఆరో తేదీకి వాయిదా

Webdunia
శుక్రవారం, 3 ఫిబ్రవరి 2023 (17:01 IST)
పార్లమెంట్ ఉభయ సభలను ఆదానీ ఎపిసోడ్ కుదిపేస్తున్నాయి. హిండెన్ బర్గ్ నివేదికగా ఆదానీ ఎంటర్‌ప్రైజెస్‌కు చెందిన గ్రూపు షేర్ల ఎఫెక్ట్ రెండో రోజు కూడా కొనసాగింది. దీంతో ఉభయ సభల కార్యకలాపాలు స్తంభించాయి. 
 
అదానీ గ్రూప్‌ తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని పరిశోధక సంస్థ హిండెన్‌బర్గ్‌ ఆరోపణలపై చర్చ జరపాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఇది కాస్తా పార్లమెంట్‌లో గందరగోళ పరిస్థితులకు దారితీసింది. దాంతో సోమవారం వరకు ఉభయ సభలు వాయిదా పడ్డాయి.
 
ఈ బడ్జెట్‌ సమావేశాల్లో అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్‌ ఇచ్చిన నివేదికపై దర్యాప్తు చేపట్టాల్సిందేనని విపక్షాలు పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) లేదా సీజేఐ ఆధ్వర్యంలోని కమిటీతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తున్నాయి. 
 
అయితే, విపక్ష సభ్యుల డిమాండ్‌ను స్పీకర్ తోసిపుచ్చారు. సభ్యుల నిరాధారమైన ఆరోపణలు చేయకూడదన్నారు. మరోవైపు రాజ్యసభ ఛైర్మన్ కూడా విపక్షాల వాయిదా తీర్మానాలను తోసిపుచ్చారు. దాంతో ప్రతిపక్ష నేతలు నినాదాలు చేశారు. ఈ గందరగోళ పరిస్థితుల మధ్య రాజ్యసభ మధ్యాహ్నం 2.30 గంటల వరకు, లోక్‌సభ మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా పడింది. 
 
తర్వాత మళ్లీ కార్యాకలాపాలు ప్రారంభమైనప్పటికీ.. విపక్షాల నుంచి అదే డిమాండ్ వినిపించింది. దాంతో ఎలాంటి చర్చ లేకుండానే పార్లమెంట్ సోమవారానికి వాయిదాపడింది. శని, ఆదివారాలు సభకు సెలవు కావడంతో ఉభయ సభలు మళ్లీ సోమవారమే తిరిగి సమావేశమవుతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: సమంత- రాజ్ వివాహం.. శామ్ చేతిలో మెరిసిన డైమండ్ రింగ్ గురించి?

Rashmika: 2025లో అత్యంత ప్రజాదరణగల తారలు, దర్శకులుగా రష్మిక మందన్నా, రిషబ్ శెట్టి ప్రకటించిన IMDb

Sholay 4K : సినీపోలిస్ ఇండియా స్వర్ణోత్సవాల కోసం షోలే 4K డిజిటల్‌ పెద్ద తెరపైకి

శ్రీలంకకు మానవతా సాయం... కాలం చెల్లిన ఆహారాన్ని పంపిన పాకిస్థాన్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments