Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ అధికారంలోకి రాకుంటే పాకిస్థాన్ దాడి చేస్తుంది : బీజేపీ మంత్రి

Webdunia
సోమవారం, 4 మార్చి 2019 (16:39 IST)
భారత్ - పాకిస్థాన్ దేశాల మధ్య ఉన్న సంబంధాలపై బీజేపీ నేతలు ఇష్టానుసారంగా నోరు పారేసుకుంటున్నారు. తాజాగా అస్సాంలో అధికార బీజేపీకి చెందిన సీనియర్ మంత్రి హిమంత బిస్వా శర్మ చేసిన వ్యాఖ్యలు ఇపుడు సంచలనం సృష్టిస్తున్నాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ తిరిగి అధికారంలోకి రాకుంటే భారత్‌పై పాకిస్థాన్ దాడి చేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. 
 
నాగోన్ జిల్లా కాంపూర్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న శర్మ మాట్లాడుతూ, 'వచ్చే ఎన్నికల్లో దేశంలోనూ, రాష్ట్రంలోనూ బీజేపీ ప్రభుత్వాన్ని మళ్లీ అధికారంలోకి తీసుకురాకపోతే పాకిస్థాన్ ఆర్మీ లేదా ఉగ్రవాదులు భారతీయ పార్లమెంట్‌తో పాటు అస్సాం అసెంబ్లీపై దాడి చేస్తారు. మోడీలాంటి బలమైన నేత ప్రధానమంత్రిగా ఉంటేనే దేశంపై ఎలాంటి దాడులు జరగకుండా మనం ప్రతిఘటించగలం. మోడీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాకపోతే మనం పాకిస్థాన్‌ను ఎదుర్కోలేం. ఈ దేశానికి మోడీలాంటి ప్రధాని అవసరం ఎంతైనా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. 
 
అంతేకాకుండా, పుల్వామా ఉగ్రదాడి ఘటన తర్వాత పాకిస్థాన్‌కు అనుకూలంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన 130 మందిని పోలీసులు అరెస్టు చేసినట్టు ఆయన తెలిపారు. బీజేపీ అధినాయకత్వంలో మనమంతా ఐక్యతగా లేకపోతే 'పాకిస్థాన్ జిందాబాద్' అనే ఇలాంటి దుష్టశక్తులు అస్సాంలో ఏదో ఒక రోజు విధ్వంసం సృష్టించడం ఖాయం. అందుకే మన యుద్ధం అభివృద్ధి మీదే కాదు. రాజకీయ గుర్తింపుతో కూడిన అభివృద్ధిపై అని గుర్తించాలి. అధికారం ఒకరి చేతిలో ఉన్నప్పుడే మనం అభివృద్ధిపైగానీ, ఇతర శక్తులపైగానీ యుద్ధం చేయగలం' అంటూ ఆయన వ్యాఖ్యానించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments