Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రార్థనా మందిరంపై దాడి... వందమంది ఉగ్రవాదులను హతం చేసిన పాకిస్థాన్

మసీదుపై దాడి చేసి వంద మందిని పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులపై పాకిస్థాన్ విరుచుకుపడింది. సింధ్ ప్రావిన్స్‌లోని లాల్ ఖలందర్ సూఫీ ప్రార్థనా మందిరంలో గురువారం జరిగిన ఆత్మాహుతి దాడికి పాక్ ప్రతీకారం తీర్చుకు

Webdunia
శనివారం, 18 ఫిబ్రవరి 2017 (10:43 IST)
మసీదుపై దాడి చేసి వంద మందిని పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులపై పాకిస్థాన్ విరుచుకుపడింది. సింధ్ ప్రావిన్స్‌లోని లాల్ ఖలందర్ సూఫీ ప్రార్థనా మందిరంలో గురువారం జరిగిన ఆత్మాహుతి దాడికి పాక్ ప్రతీకారం తీర్చుకుంది. దాడి జరిగిన వెంటనే స్పందించిన పాక్ శుక్రవారం నాటికి వందమంది ఉగ్రవాదులను హతమార్చింది. 
 
గురువారం జరిగిన ఆత్మాహుతి దాడిలో 88 మంది మృతి చెందగా 250 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో ఉలిక్కిపడిన పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఉగ్రవాదుల ఏరివేతకు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. దీంతో పాక్ భద్రతా దళాలు దేశ వ్యాప్తంగా దాడులు నిర్వహించాయి. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో మొత్తం వందమంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్టు అధికార వర్గాలు తెలిపాయి. 
 
మందిరంపై దాడి వెనక ఆఫ్ఘనిస్థాన్ ఉగ్రవాదుల హస్తం ఉన్నట్టు గుర్తించిన పాక్ ఆర్మీ 76 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల పేర్లున్న జాబితాను ఆఫ్ఘాన్ రాయబార కార్యాలయానికి అందించి వెంటనే చర్యలు తీసుకోవడమో, లేదంటే తమకు అప్పగించడమో చేయాలని డిమాండ్ చేసింది. కాగా దాడి తమపనేనని ఉగ్రవాద సంస్థ ఐసిస్ ప్రకటించింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments