Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్ వెళ్ళాలా వద్దా... నాన్చొద్దు.. తేల్చండి : నవజ్యోత్ సిద్ధూ

Webdunia
గురువారం, 7 నవంబరు 2019 (16:38 IST)
పాకిస్థాన్ వెళ్లాలా వద్దా... ఏదో ఒకటి తేల్చండి.. సమస్యను నాన్చొద్దు అంటూ కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ కేంద్రాన్ని కోరారు. పాకిస్థాన్‌లోని కర్తార్పూర్ సాహిబ్ కారిడార్ ప్రారంభోత్సవానికి వెళ్లేందుకు అనుమతించాలంటూ తన లేఖలో విజ్ఞప్తి చేశారు. తనకు పాకిస్థాన్ వీసా కూడా మంజూరు చేసిందని వెల్లడించారు. 
 
'ఇప్పటికి పలుమార్లు ఈ విషయాన్ని మీ దృష్టికి తెచ్చినా స్పందన లేదు. కర్తార్పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతి ఇస్తుందో ఇవ్వదో కూడా చెప్పడంలేదు' అంటూ కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్‌కు రాసిన లేఖలో సిద్ధూ తన అసహనాన్ని వ్యక్తం చేశారు.
 
సిక్కుల పవిత్ర పుణ్యక్షేత్రమైన కర్తార్పూర్ సాహిబ్ కారిడార్‌ను పాకిస్థాన్ ప్రభుత్వం ఈ నెల 9న ప్రారంభిస్తోంది. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఈ కార్యక్రమానికి తన స్నేహితుడైన సిద్ధూను కూడా ఆహ్వానించారు. కొన్నాళ్ల కిందట ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ ప్రమాణస్వీకారం చేస్తుంటే సిద్ధూ కూడా హాజరై శుభాకాంక్షలు తెలిపిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments