Webdunia - Bharat's app for daily news and videos

Install App

భద్రతా దళాలు- ఉగ్రవాదుల మధ్య కాల్పులు.. నాలుగో రోజు ఎన్‌కౌంటర్

Webdunia
శనివారం, 16 సెప్టెంబరు 2023 (17:27 IST)
జమ్మూకాశ్మీర్‌లోని భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య వరుసగా నాలుగో రోజు ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. కోకెరంగ్‌లోని గడుల్ అటవీ ప్రాంతంలో లష్కరే ఉగ్రవాదులు నక్కినట్టు సమాచారం అందుకున్న సైన్యం, స్థానిక పోలీసులు మంగళవారం గాలింపు చర్యలు చేపట్టారు. 
 
ఆ రోజు రాత్రి ఉగ్రవాదులతో ప్రారంభమైన ఎన్‌కౌంటర్ రోజులు గుడుస్తున్నా కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో ఓ సైనికుడు గల్లంతవగా, ముగ్గురు అధికారులు అమరులయ్యారు. 
 
కొండపైన గుహలో ఉన్న ఉగ్రవాదులు కిందనున్న భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరుపుతున్నారు. కొండను చుట్టుముట్టిన భద్రతా బలగాలు రాకెట్ లాంచర్లు ప్రయోగిస్తున్నాయి. 
 
వాతావరణంతో పాటు అక్కడి పరిస్థితులు సైన్యానికి సవాలుగా మారడంతో ఉగ్రవాదులపై పట్టు సాధించడం కష్టంగా మారుతోంది. పూర్తిస్థాయి శిక్షణ పొందిన ఉగ్రవాదులు కావాల్సిన ఆహారం, పేలుడు సామగ్రితో పక్కా ప్రణాళిక ప్రకారం అందులో తలదాచుకున్నారు. గుహలో ఇద్దరు ముగ్గురు కంటే ఎక్కువమంది ఉగ్రవాదులు ఉండొచ్చని సైనికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిజమైన భారతీయుడు ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్: ఎస్.జె సూర్య (Video)

రూ.1,000 కోట్ల క్లబ్‌కు చేరువలో ప్రభాస్ "కల్కి 2898 AD"

పిల్లల ఫోటోలు సోషల్ మీడియాలోనా.. పేరెంట్స్ అలెర్ట్: సాయి ధరమ్ తేజ్

ప్రభాస్‌కు పెళ్లి చేయాలని మాకూ వుంది.. కానీ టైం రావాలి: శ్యామలాదేవి

రాజ్ తరుణ్‌తో నాకెలాంటి సంబంధం లేదు.. హీరోయిన్ మాల్వి మల్హోత్రా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments