Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంద్రాణి ముఖర్జియా, పీటర్ ముఖర్జీయా కేసుతో లింక్.. చిదంబరం ఇంటిపై సీబీఐ రైడ్

షీనా బోరా హత్య కేసులో ఇరుక్కుని జైలులో గడుపుతున్న ఇంద్రాణి ముఖర్జియా, ఆమె భర్త పీటర్ ముఖర్జియాలు నిర్వహించిన మీడియా కంపెనీకి లబ్ధి చేకూర్చారనే విషయంపై సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది.

Webdunia
మంగళవారం, 16 మే 2017 (11:41 IST)
షీనా బోరా హత్య కేసులో ఇరుక్కుని జైలులో గడుపుతున్న ఇంద్రాణి ముఖర్జియా, ఆమె భర్త పీటర్ ముఖర్జియాలు నిర్వహించిన మీడియా కంపెనీకి లబ్ధి చేకూర్చారనే విషయంపై కేంద్ర మాజీ ఆర్థిక, హోం మంత్రి పీ చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం ఇంటితో పాటు 14 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు జరుగుతున్నాయి.

కార్తీ చిదంబరం సంస్థ 2008లో లంచాలు తీసుకుని ఐఎన్ఎక్స్ మీడియాకు కేంద్రం నుంచి అనుమతులు ఇప్పించినట్లు సీబీఐ వర్గాలు గుర్తించాయి. ఐఎన్ఎక్స్ మీడియా ఫారిన్ ఎక్చేంజ్ ప్రమోషన్ బోర్డు (ఎఫ్‌ఐపీబీ) నుంచి రూ.4కోట్ల నిధుల సమీకరణకు అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకుంది. 
 
అయితే ఆర్థిక శాఖ నుంచి అనుమతి ఇప్పించేందుకు కార్తీ చిదంబరం సంస్థ రూ.10 లక్షలు లంచం తీసుకుందని.. ఆపై ఐఎన్ఎక్స్ మీడియా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి రూ.305కోట్లను సమీకరించిందని సీబీఐ వర్గాల సమాచారం. ఈ ఒప్పందాలు కుదిరిన సమయంలో మాజీ ప్రధాన మంత్రి  మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్నారని.. ఈ స్కామ్‌లో పీసీ పాత్ర ఉందా అనే కోణంలో దర్యాప్తు జరుగుతుందని సీబీఐ వర్గాల సమాచారం.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments