అంబానీ ఇంటి వద్ద పేలుడు.. స్కార్పియో కారు యజమాని సూసైడ్

Webdunia
శుక్రవారం, 5 మార్చి 2021 (20:07 IST)
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేశ్ అంబానీ ఇంటి వద్ద ఇటీవల బాంబు పేలుడు సంభవించింది. స్కార్పియో కారులో ఈ పేలుడు సంభవించింది. ఇది ముంబై మహానగరంలో కలకలం రేపింది. ఇపుడు ఈ కారు యజమాని బలవన్మరణానికి పాల్పడ్డాడు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, గత నెల 25వ తేదీన అంబానీ ఇంటికి సమీపంలో ఓ స్కార్పియో వాహనాన్ని పార్క్ చేసి ఉంచారు. భద్రతా సిబ్బంది ఆ వాహనాన్ని గుర్తించి తనిఖీ చేయగా, అందులో జిలెటిన్ స్టిక్స్‌ను కనుగొన్నారు. అంతేకాదు ముఖేశ్ అంబానీ భార్య నీతా అంబానీకి రాసిన ఒక లేఖ కూడా అందులో దొరికింది. 
 
ఆ తర్వాత ఆ వాహనం రిజిస్ట్రేషన్ నంబరు ఆధారంగా పూర్తి వివరాలను సేకరించారు. ఈ క్రమంలో ఆ కారు యజమాని మన్‌సుఖ్ హిరెన్ ఆత్మహత్య చేసుకున్నారు. ముంబైకి సమీపంలోని ఓ వాగులో అతని మృతదేహాన్ని శుక్రవారం గుర్తించారు. వంతెనపై నుంచి దూకి అతను ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు చెబుతున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.
 
కాగా, అంబానీ ఇంటి వద్ద ఉన్న స్కార్పియో వాహనం అంతకు ముందే చోరీకి గురైనట్టు పోలీసులు గుర్తించారు. ఆ వాహనాన్ని తామే అక్కడ ఉంచినట్టు జైష్ ఉల్ హింద్ సంస్థ ప్రకటించుకుంది. అయితే, ఆ ఘటనకు ఆ సంస్థకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులు స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కౌబాయ్ చిత్రంలో నటిస్తానని ఊహించలేదు : చిరంజీవి

కొదమసింహం.. నాకు, రామ్ చరణ్ కు ఫేవరేట్ మూవీ - మెగాస్టార్ చిరంజీవి

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ ప్రధానపాత్రలో చిత్రం చెన్నైలో ప్రారంభం

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments