Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో పది విమానాలకు బాంబు బెదిరింపులు...

ఠాగూర్
మంగళవారం, 22 అక్టోబరు 2024 (14:12 IST)
భారత్‌కు విమానాలకు వరుస బాంబు బెదిరింపులు వస్తున్నాయి. దీంతో ప్రయాణికులతో పాటు విమానాశ్రయ అధికారులు ఆందోళనకు గురవుతున్నారు. తాజాగా ఇండిగో సంస్థకు చెందిన పది విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చినట్టు ఆ సంస్థకు చెందిన అధికారులు వెల్లడించారు. బాంబు బెదిరింపులు వచ్చిన విమాన సర్వీసుల్లో దేశీయంగా నడిచే విమాన సర్వీసులతో పాటు.. విదేశీ సర్వీసులు కూడా ఉన్నట్టు పేర్కొన్నారు. 
 
ముఖ్యంగా, జెడ్డా, ఇస్తాంబుల్, రియాద్ వంటి అంతర్జాతీయ సర్వీసులను లక్ష్యంగా చేసుకుని ఈ బెదిరింపులు వచ్చాయని వెల్లడించారు. కాగా, ఈ వారంలో ఇప్పటివకు దాదాపు వందకు పైగా ఇండిగో విమాన సర్వీసులకు బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెల్సిందే. 
 
ఇదే అంశంపై ఇండిగో సంస్థ అధికారులు స్పందిస్తూ, "జెడ్డా, ఇస్తాంబుల్, రియాద్ అంతర్జాతీయ మార్గాల్లో ప్రయాణించే విమానాలకు మంగళవారం బాంబు బెదిరింపులు రావడంతో మా సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. ప్రయాణికులను తరలించి.. తనిఖీలు నిర్వహిస్తున్నాము'' అని ఇండిగో ఉన్నతాధికారులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijayashanti: అర్జున్ S/O వైజయంతి తర్వాత విజయశాంతి సినిమాలు చేయదా?

Anasuya Bharadwaj: అరి చిత్రానికి కష్టాలు- రిలీజ్‌ ను ఆపుతుంది ఎవరు?

Tamannaah : ముంబైలో తమన్నా భాటియా ఓదెల 2 ట్రైలర్ లాంచ్ కాబోతోంది

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments