Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో పది విమానాలకు బాంబు బెదిరింపులు...

ఠాగూర్
మంగళవారం, 22 అక్టోబరు 2024 (14:12 IST)
భారత్‌కు విమానాలకు వరుస బాంబు బెదిరింపులు వస్తున్నాయి. దీంతో ప్రయాణికులతో పాటు విమానాశ్రయ అధికారులు ఆందోళనకు గురవుతున్నారు. తాజాగా ఇండిగో సంస్థకు చెందిన పది విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చినట్టు ఆ సంస్థకు చెందిన అధికారులు వెల్లడించారు. బాంబు బెదిరింపులు వచ్చిన విమాన సర్వీసుల్లో దేశీయంగా నడిచే విమాన సర్వీసులతో పాటు.. విదేశీ సర్వీసులు కూడా ఉన్నట్టు పేర్కొన్నారు. 
 
ముఖ్యంగా, జెడ్డా, ఇస్తాంబుల్, రియాద్ వంటి అంతర్జాతీయ సర్వీసులను లక్ష్యంగా చేసుకుని ఈ బెదిరింపులు వచ్చాయని వెల్లడించారు. కాగా, ఈ వారంలో ఇప్పటివకు దాదాపు వందకు పైగా ఇండిగో విమాన సర్వీసులకు బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెల్సిందే. 
 
ఇదే అంశంపై ఇండిగో సంస్థ అధికారులు స్పందిస్తూ, "జెడ్డా, ఇస్తాంబుల్, రియాద్ అంతర్జాతీయ మార్గాల్లో ప్రయాణించే విమానాలకు మంగళవారం బాంబు బెదిరింపులు రావడంతో మా సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. ప్రయాణికులను తరలించి.. తనిఖీలు నిర్వహిస్తున్నాము'' అని ఇండిగో ఉన్నతాధికారులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

Ustad: ఉస్తాద్ కోసం పవన్ కళ్యాణ్, శ్రీలీల పై క్లాప్ కొట్టిన హరీశ్ శంకర్

Surya46: సూర్య, వెంకీ అట్లూరి కలయికలో Suriya46 రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Mangli Birthday: త్రిపుర రిసార్ట్‌లో మంగ్లీ పుట్టిన రోజు.. డ్రగ్స్ టెస్టులో పాజిటివ్

AS Ravi Kumar Chowdhury: యజ్ఞం దర్శకుడు AS రవి కుమార్ చౌదరి మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

తర్వాతి కథనం
Show comments