Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో పది విమానాలకు బాంబు బెదిరింపులు...

ఠాగూర్
మంగళవారం, 22 అక్టోబరు 2024 (14:12 IST)
భారత్‌కు విమానాలకు వరుస బాంబు బెదిరింపులు వస్తున్నాయి. దీంతో ప్రయాణికులతో పాటు విమానాశ్రయ అధికారులు ఆందోళనకు గురవుతున్నారు. తాజాగా ఇండిగో సంస్థకు చెందిన పది విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చినట్టు ఆ సంస్థకు చెందిన అధికారులు వెల్లడించారు. బాంబు బెదిరింపులు వచ్చిన విమాన సర్వీసుల్లో దేశీయంగా నడిచే విమాన సర్వీసులతో పాటు.. విదేశీ సర్వీసులు కూడా ఉన్నట్టు పేర్కొన్నారు. 
 
ముఖ్యంగా, జెడ్డా, ఇస్తాంబుల్, రియాద్ వంటి అంతర్జాతీయ సర్వీసులను లక్ష్యంగా చేసుకుని ఈ బెదిరింపులు వచ్చాయని వెల్లడించారు. కాగా, ఈ వారంలో ఇప్పటివకు దాదాపు వందకు పైగా ఇండిగో విమాన సర్వీసులకు బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెల్సిందే. 
 
ఇదే అంశంపై ఇండిగో సంస్థ అధికారులు స్పందిస్తూ, "జెడ్డా, ఇస్తాంబుల్, రియాద్ అంతర్జాతీయ మార్గాల్లో ప్రయాణించే విమానాలకు మంగళవారం బాంబు బెదిరింపులు రావడంతో మా సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. ప్రయాణికులను తరలించి.. తనిఖీలు నిర్వహిస్తున్నాము'' అని ఇండిగో ఉన్నతాధికారులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కళ్యాణి ప్రియదర్శన్‌ ను కొత్తగా ఆవిష్కరించిన కోత లోకహ్ 1: చంద్ర ట్రైలర్

Sreeleela: జూనియర్ ఎన్టీఆర్‌ను చూసి ముచ్చటపడిన శ్రీలీల తల్లి స్వర్ణలత

Amani: ఒగ్గు కళాకారుల నేపథ్యం లో తెరకెక్కిన బ్రహ్మాండ చిత్రం

బార్బరిక్ షూటింగ్‌లో ప్రతీ రోజూ ఛాలెంజింగ్‌గా అనిపించేది : వశిష్ట ఎన్ సింహా

హర హర శంకర పాటలో సమాజంలో ఘోరాల్ని చూపించారు : తనికెళ్ళ భరణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments