Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎడప్పాడికి చెక్.. అమ్మ టీవీ 24x7 త్వరలో ప్రారంభం.. జీ టీవీని ఓపీఎస్ కొనేశారా?

తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వం ఛానల్ కొనేశారు. ప్రస్తుత తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిస్వామి ప్రభుత్వానికి చుక్కలు చూపించేందుకు వీలుగా.. ఇప్పటికే ఓ టీవీ ఛానల్‌ను ఓపీఎస్‌ కొనేశారని వార్తలు వస్తున్నాయి.

Webdunia
మంగళవారం, 4 ఏప్రియల్ 2017 (16:56 IST)
తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వం ఛానల్ కొనేశారు. ప్రస్తుత తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిస్వామి ప్రభుత్వానికి చుక్కలు చూపించేందుకు వీలుగా.. ఇప్పటికే ఓ టీవీ ఛానల్‌ను ఓపీఎస్‌ కొనేశారని వార్తలు వస్తున్నాయి. గతంలో అమ్మ టీవీ ఛానల్‌ను త్వరలోనే ప్రారంభిస్తామని ఓపీఎస్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

తాము కొత్తగా ప్రారంభించే ఛానల్‌కు అమ్మ టీవీ 24x7 న్యూస్ చానల్ అని పేరుపెడుతామని ఇప్పటికే పన్నీర్ సెల్వం వర్గీయులు ప్రకటించారు. చెప్పిన మాట ప్రకారం.. ఆర్కే నగర్ ఉప ఎన్నికలు పూర్తయిన తర్వాత అమ్మ టీవీ ఛానల్‌కు శ్రీకారం చుడుతామని ఓపీఎస్ వర్గీయులు భావిస్తున్నారు. 
 
ఇప్పటికే తమిళనాడులో ప్రసారం అవుతున్న మడిప్పాకం విశ్వనాథంకు చెందిన జీటీవీని పన్నీర్ వర్గీయులు కొనుగోలు చేశారు. ఈ టీవీకి అమ్మ టీవీగా పేరు మార్చేసి అధికారికంగా ప్రసారం చేసేందుకు ఓపీఎస్ అండ్ టీమ్ రంగం సిద్ధం చేస్తోంది. ఈ టీవీలో శశికళ.. కుటుంబ సభ్యులు అమ్మ జయలలితకు చేసిన ద్రోహాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తారని తెలుస్తోంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐదు పదుల వయసులో శిల్పాశెట్టి ఫిట్నెస్ సీక్రెట్ ఇదే!

ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 3లో పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ, తన డబ్బునంతా కపిల్ శర్మకు అప్పగించారా?

Natti kumar: ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ కలిసి సినీ కార్మికులను మోసం చేశారు : నట్టి కుమార్ ఫైర్

Govinda-Sunita divorce: గోవింద- సునీత విడాకులు తీసుకోలేదు.. మేనేజర్

వారం ముందుగానే థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న లిటిల్ హార్ట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments