Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాది దేశ అజెండా - ప్రతిపక్షాలది పాకిస్థాన్ అజెండా : ప్రధాని మోడీ

Webdunia
గురువారం, 17 ఫిబ్రవరి 2022 (14:38 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోమారు విపక్ష పార్టీలపై విరుచుకుపడ్డారు. తమ దేశ అజెండా అని, విపక్ష పార్టీలది పాకిస్థాన్ అజెండా అంటూ ధ్వజమెత్తారు. దేశభక్తి, అభివృద్ధిని స్ఫూర్తిగా తీసుకునే ప్రభుత్వం పంజాబ్ రాష్ట్రంలో ఏర్పాటు కావాలని ఆయన పిలుపునిచ్చారు. 
 
తాను చేపట్టిన పంజాబ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఫజిల్కా జిల్లాలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, సర్జికల్ స్ట్రైక్స్‌కు ఆధారాలు చూపమంటూ డిమాండ్ చేస్తున్న విపక్ష పార్టీలది పాకిస్థాన్ అజెండా అని ఆరోపించారు. 
 
గతంలో ఒకరు పంజాబ్‌ను గతంలో లూటీ చేశారని, మరొకరు ఇపుడు ఢిల్లీలో కుంభకోణాలకు పాల్పడున్నారంటూ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలను ఉద్దేశించి ఆయన విమర్శలు చేశారు. ఈ రెండు పార్టీలు ఒకేతాను ముక్కలేనని, ఇపుడు కుస్తీపట్టినట్టు డ్రామాలు ఆడుతాయని ఎద్దేవా చేశారు. 
 
అంతేకాకుండా, ఉత్తరప్రదేశ్ సోదరులను రావొద్దన్న పంజాబ్ ముఖ్యమంత్రి చన్నీపై ఆయన విమర్శలు చేశారు. గురుగోవింద్ సింగ్ సంత్ రవిదాస్ ఎక్కడ పుట్టారంటూ ఆయన నిలదీశారు. గురుగోవింద్ సింగ్ బీహార్‌లోని పాట్నా సాహిబ్‌లో జన్మిస్తే, సంత్ రవిదాస్ యూపీలోని వారణాసిలో జన్మించారని గుర్తుచేశారు. అంటే ఈ రెండు రాష్ట్రాల ప్రజలను రావొద్దనంటే వారిని అవమానించినట్టేనని ప్రధాని వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments