పెద్ద నోట్ల రద్దు దెబ్బ కాదు.. వాన్నా క్రై వైరస్ దెబ్బ.. దేశవ్యాప్తంగా ఏటీఎమ్‌ల మూసివేత

పెద్ద నోట్ల రద్దు దెబ్బతో ఇప్పటికీ దేశంలో 60 నుంచి 75 శాతం ఏటీఎంలు పనిచేయడం లేదు. ఇప్పుడు పుండు మీద కారం లాగా ప్రపంచ వైరస్‌లకు అమ్మలాంటి వాన్నా క్రై వైరస్‌ దెబ్బకు మిగిలిన ఎంటీఎంలు కూడా మూసివేతకు గురయ్యాయి. విండోస్ ఎక్స్‌పీ ఆపరేటింగ్ సిస్టమ్‌కు తగు

Webdunia
సోమవారం, 15 మే 2017 (08:38 IST)
పెద్ద నోట్ల రద్దు దెబ్బతో ఇప్పటికీ దేశంలో 60 నుంచి 75 శాతం ఏటీఎంలు పనిచేయడం లేదు. ఇప్పుడు పుండు మీద కారం లాగా ప్రపంచ వైరస్‌లకు అమ్మలాంటి  వాన్నా క్రై వైరస్‌ దెబ్బకు మిగిలిన  ఎంటీఎంలు కూడా మూసివేతకు గురయ్యాయి. విండోస్ ఎక్స్‌పీ ఆపరేటింగ్ సిస్టమ్‌కు తగులుకున్న ఈ భీకర వైరస్ దెబ్బకు 75 దేశాల్లోని నెట్‌వర్క్‌లు కుప్పగూలిన సందర్భంగా విండోస్ కొత్త అప్‌డేట్‌ వచ్చే వరకూ ఏటీఎం సెంటర్లను మూసేయాలని ఆర్‌బీఐ బ్యాంకులను ఆదేశించింది. కంప్యూటర్‌లోకి ర్యాన్‌సమ్‌ వేర్‌ను చొప్పించి డేటాను చోరి చేసి బిట్‌ కాయిన్ల రూపంలో డాలర్లను.. వాన్నా క్రై డిమాండ్‌ చేస్తున్న విషయం తెలిసిందే.
 
ఇప్పుడు జరిగిన నష్టం చాలదన్నట్లుగా సోమవారం రెండో సారి వాన్నా క్రై హ్యాకింగ్‌కు పాల్పడతుందనే వార్తలతో వణుకుతున్న ప్రపంచదేశాలు అప్రమత్తమవుతున్నాయి.వాన్నా క్రై బాధితుల్లో ఎక్కువ మంది వినియోగించేది విండోస్‌ ఆపరేటింగ్‌ సిస్టం. భారత్‌లో దాదాపు 90 శాతం మంది విండోస్‌ మీదే ఆధారపడుతున్నారు. మన దేశంలో ఉన్న 2.25 లక్షల ఏటీఎంలలో 60 శాతం విండోస్ ఆపరేటింగ్‌ సిస్టంతో నడిచేవే. దీంతో రక్షణ చర్యలు చేపట్టిన ఆర్‌బీఐ సెక్యూరిటీ అప్‌డేట్ వచ్చే వరకూ ఏటీఎంలను తెరవొద్దని ఆదేశాలు జారీ చేసింది. వాన్నా క్రై లక్ష్యం ఏటీఎంల నుంచి ప్రజల డబ్బును దొంగిలించడం కాదని.. నెట్‌వర్క్‌లలో సమాచారాన్ని లాక్‌ చేసి డబ్బును డిమాండ్‌ చేస్తుందని ఓ బ్యాంకు అధికారి పేర్కొన్నారు.
 
ఒకవేళ వాన్నా క్రై ఏటీఎంల నెట్‌వర్క్‌లను హ్యాక్‌ చేస్తే.. వినియోగదారులు ఎలాంటి లావాదేవీలు జరపలేరని వివరించారు. అయితే, ఇప్పటికే రెండు దక్షిణాది బ్యాంకుల కంప్యూటర్లు హ్యాకింగ్‌కు గురయ్యాయనే పుకార్లు కూడా వస్తున్నాయి. ఆర్‌బీఐ దీని మీద ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు.
 
దేశంలో ఉన్న 2.25 లక్షల ఏటీఎంలలో 60 శాతం విండోస్ ఆపరేటింగ్‌ సిస్టంకు కొత్త అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్ చేసేంతవరకు ఏటీఎంలు పూర్తిగా పనిచేయవు. పాతికేళ్ల క్రితం ఉద్యోగుల తొలగింపు లక్ష్యంగా ప్రపంచ వ్యాప్తంగా జరిగిన కంప్యూటరీకరణ దుష్ఫలితాలను ప్రపంచం ఇలా అనుభవించాల్సిందే మరి.
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nagarjuna: తల్లిదండ్రుల జ్ఞాపకార్థం రెండు కోట్ల స్కాలర్‌షిప్ ప్రకటించిన నాగార్జున

B. Nagi Reddy: బి.నాగిరెడ్డి జీవితమే ఓ గొప్ప వ్యక్తిత్వ వికాస గ్రంథం.

Sreeleela: ఏఐ-జనరేటెడ్ నాన్సెన్స్‌కు మద్దతు ఇవ్వవద్దు.. శ్రీలీల

Naresh Agastya: సముద్రంలో 3 నిమిషాల 40 సెకండ్స్ 80 ఫీట్స్ డెప్త్ వెళ్లా : నరేష్ అగస్త్య

కేడి దర్శకుడు కిరణ్ కుమార్ కన్నుమూత.. షాకైన టాలీవుడ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్ చికిత్స కోసం సిప్లా యుర్పీక్ ప్రారంభం

గాజువాక ప్రభుత్వ పాఠశాలలో నాట్స్ సాయంతో గ్రీన్ స్టూడియో

ధ్యానంలోకి మరింత లోతుగా ఎలా వెళ్లాలి?: గురుదేవ్ శ్రీ శ్రీ రవి శంకర్

ఉసిరి, నిమ్మకాయతో ఉప్పు.. గుండె ఆరోగ్యంతో పాటు రక్తపోటుకు చెక్

అప్పుడప్పుడు కాస్త పచ్చికొబ్బరి కూడా తింటుండాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments