Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ మాతాకి జై అన్నవారికే భారత్‌లో చోటు : కేంద్ర మంత్రి కైలాశ్ చౌదరి

Webdunia
సోమవారం, 16 అక్టోబరు 2023 (18:53 IST)
ప్రధాని నరేంద్ర మోడీ మంత్రి వర్గంలో సహాయ మంత్రిగా ఉన్న కైలాశ్ చౌదరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్ మాతాకీ జై అన్నవారికే దేశంలో చోటు ఉంటుందన్నారు. ఆయన తాజాగా హైదరాబాద్ నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 
 
భారత్‌లో ఉండాలనుకునేవారు తప్పకుండా భారత్ మాతాకీ జై అనాల్సిందేనని చెప్పారు. అలాగే, హైదరాబాద్ నగరంలో ప్రజాప్రతినిధులు వాడుతున్న  భాషపై ఆయన కామెంట్స్ చేశారు. ఇలాంటి వారికి తగిన గుణపాఠం చెప్పాల్సిందేనని అన్నారు.
 
రాష్ట్రం (తెలంగాణ)లో జాతీయవాద ఆలోచనలతో కూడిన ప్రభుత్వం ఏర్పడాలని అన్నారు. భారత్‌లో ఉంటూ పాకిస్థాన్ జిందాబాద్ అంటారా? అని ప్రశ్నించారు. 'వందేమాతరం', 'భారత్ మాతా కీ జై' అన్న వారికే దేశంలో చోటు ఉంటుందని స్పష్టం చేశారు. 
 
'ఎవరైతే 'భారత్ మాతా కీ జై' అనరో, ఎవరికైతే హిందూస్థాన్ మీద, భారత్ మీద విశ్వాసం లేదో, ఎవరైతే 'పాకిస్థాన్ జిందాబాద్' అంటారో వారు పాకిస్థాన్ వెళ్లిపోవాల్సిందే. అలాంటి వారికి ఇక్కడ స్థానం లేదు' అని మంత్రి కైలాశ్ చౌదరి తేల్చి చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దేవుడి దయ. సినిమా అద్భుతమైన విజయం సాధించింది : సి. అశ్వనీదత్

శివాజీ నటిసున్న సోషియో ఫాంటసీ మూవీ కూర్మనాయకి

విజయ్ ఆంటోనీ పొయెటిక్ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ వచ్చేసింది

చిత్రపురి కాలనీలో అవినీతి కేవలం ఆరోపణ మాత్రమే: సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనీల్‌

నాగ్.. దేవుడు ఇచ్చిన వరం - కొడుకు లేని లోటు తీర్చాడు : అశ్వనీదత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments