Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ మాతాకి జై అన్నవారికే భారత్‌లో చోటు : కేంద్ర మంత్రి కైలాశ్ చౌదరి

Webdunia
సోమవారం, 16 అక్టోబరు 2023 (18:53 IST)
ప్రధాని నరేంద్ర మోడీ మంత్రి వర్గంలో సహాయ మంత్రిగా ఉన్న కైలాశ్ చౌదరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్ మాతాకీ జై అన్నవారికే దేశంలో చోటు ఉంటుందన్నారు. ఆయన తాజాగా హైదరాబాద్ నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 
 
భారత్‌లో ఉండాలనుకునేవారు తప్పకుండా భారత్ మాతాకీ జై అనాల్సిందేనని చెప్పారు. అలాగే, హైదరాబాద్ నగరంలో ప్రజాప్రతినిధులు వాడుతున్న  భాషపై ఆయన కామెంట్స్ చేశారు. ఇలాంటి వారికి తగిన గుణపాఠం చెప్పాల్సిందేనని అన్నారు.
 
రాష్ట్రం (తెలంగాణ)లో జాతీయవాద ఆలోచనలతో కూడిన ప్రభుత్వం ఏర్పడాలని అన్నారు. భారత్‌లో ఉంటూ పాకిస్థాన్ జిందాబాద్ అంటారా? అని ప్రశ్నించారు. 'వందేమాతరం', 'భారత్ మాతా కీ జై' అన్న వారికే దేశంలో చోటు ఉంటుందని స్పష్టం చేశారు. 
 
'ఎవరైతే 'భారత్ మాతా కీ జై' అనరో, ఎవరికైతే హిందూస్థాన్ మీద, భారత్ మీద విశ్వాసం లేదో, ఎవరైతే 'పాకిస్థాన్ జిందాబాద్' అంటారో వారు పాకిస్థాన్ వెళ్లిపోవాల్సిందే. అలాంటి వారికి ఇక్కడ స్థానం లేదు' అని మంత్రి కైలాశ్ చౌదరి తేల్చి చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments