Webdunia - Bharat's app for daily news and videos

Install App

పక్కింటి మహిళతో తల్లి మాటలు.. ఉల్లిపాయ మింగేసిన చిన్నారి.. ఊపిరాడక.. ఏడ్వలేక..?

తల్లి నిర్లక్ష్యం కారణంగా ఏడాది చిన్నారి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. పక్కింటి మహిళతో మాట్లాడుతూ తన బిడ్డను పట్టించుకోని ఆ తల్లికి కడుపుకోతే మిగిలింది. ఇంతకీ ఏమైందంటే.. ఉల్లిపాయను మింగేసిన ఏడాది చిన్న

Webdunia
సోమవారం, 24 అక్టోబరు 2016 (20:19 IST)
తల్లి నిర్లక్ష్యం కారణంగా ఏడాది చిన్నారి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. పక్కింటి మహిళతో మాట్లాడుతూ తన బిడ్డను పట్టించుకోని ఆ తల్లికి కడుపుకోతే మిగిలింది. ఇంతకీ ఏమైందంటే.. ఉల్లిపాయను మింగేసిన ఏడాది చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. కనహోసాహళ్లి గ్రామానికి చెందిన కల్పేశ్, అర్చనలకు నిత్య శ్రీ అనే కుమార్తె వుంది. శనివారం ఇంటి బాల్కనీలో నిత్య శ్రీ ఆడుకుంటూ వుంది. అర్చన పక్కింటి మహిళతో మాట్లాడుకుంటూ వుండిపోయింది. ఇక వరండాలో ఆరబెట్టిన ఉల్లిపాయలతో ఆడుకుంటున్న నిత్యశ్రీ.. ఉల్లిని మింగేసింది. ఇక ఉల్లిపాయ గొంతుకు అడ్డుపడటంతో నిత్యకు ఊపిరిరాడక ఇబ్బంది పడింది. 
 
కనీసం ఏడ్వలేకపోయింది. కొద్దిసేపటికే స్పృహ తప్పి కిందపడిపోయింది. దీన్ని గమనించిన నిత్య తల్లి అర్చన కంగారుతో ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. అప్పటికే ఊపిరాడక పోవడంతో చిన్నారి చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో అర్చన బోరున విలపించింది. నిత్య మృతితో బళ్లారిలో విషాదఛాయలు అలముకున్నాయి. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments