Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో ఒమిక్రాన్ దూకుడు - 361కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య

Webdunia
శుక్రవారం, 24 డిశెంబరు 2021 (07:31 IST)
దేశంలో ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతుంది. గురువారానికి దేశ వ్యాప్తంగా నమోదైన ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య 361కు చేరింది. వీటిలో ఒక్క తమిళనాడులో ఒకే రోజు ఏకంగా 33 కేసులు వెలుగు చూశాయి. దీంతో ఒమిక్రాన్ కేసుల జాబితాలో తమిళనాడు మూడో స్థానానికి ఎగబాకింది. దీంతో కేంద్రం కొత్త మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. 
 
ఇప్పటికే డెల్టా వేరియంట్‌ ఓ వైపు భయపెడుతుంది. మరోవైపు, ఒమిక్రాన్ టెన్షన్ ప్రారంభమైంది. ఈ మధ్య భారత్‌లోకి ప్రవేశించిన ఈ వైరస్... క్రమక్రమంగా రాష్ట్రాలకు విస్తరిస్తుంది. గురువారం మరో 89 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 361కు చేరింది. ఈ నేపథ్యంలో కేంద్రం కొత్త మార్గదర్శకాలను జారీచేసింది.  
 
ఢిల్లీలో క్రిస్మస్, కొత్త సంవత్సర వేడుకలను రద్దు చేసింది. అలాగే, ముంబైలో రాత్రిపూట 144 సెక్షన్‌ను అమల్లోకి తెచ్చింది. గుజరాత్‌లోని 9 నగరాల్లో, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ విధించారు. కర్నాటక రాష్ట్రంలో సామూహిక వివాహాలపై నిషేధం విధించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల 31వ తేదీ వరకు 144 సెక్షన్ విధించారు. ఒమిక్రాన్ వైరస్ పట్ల జాగ్రత్తగా ఉండాలని కేంద్రం కూడా అన్ని రాష్ట్రాలను హెచ్చరించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఉస్తాద్ రామ్ పోతినేని, పూరి జగన్నాధ్ కాంబోలో డబుల్ ఇస్మార్ట్ టైటిల్ సాంగ్ షూటింగ్

హ్యాట్సాఫ్ కింగ్ నాగార్జున.. నెట్టేసిన ఫ్యాన్‌ను కలిశాడు.. (వీడియో)

నేను-కీర్తన తో చిమటా రమేష్ బాబు విజయభేరి మ్రోగించాలి : మురళీమోహన్

15 కోట్లతో మట్కా చిత్రం కోసం ఫిలింసిటీలో వింటేజ్ వైజాగ్ సెట్‌

ప్రపంచ వ్యాప్తంగా కమ్ముకున్న "కల్కి" ఫీవర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments