Webdunia - Bharat's app for daily news and videos

Install App

మందు తాగొద్దన్నాడనీ యజమానిని హత్య చేసిన సర్వెంట్

Webdunia
గురువారం, 31 జనవరి 2019 (16:50 IST)
మద్యం తాగవద్దని నివారించినందుకు యజమానిని గొడ్డలితో నరికి చంపిన ఘటన మంగళవారం రాత్రి ఒడిశాలో జరగగా బుధవారం వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే, ఖుర్దా జిల్లా సిమోరొ గ్రామానికి చెందిన 35 ఏళ్ల సత్యబ్రత అనే యువకుడు ఊళ్లో కొత్త ఇల్లు కట్టాడు. అతని తల్లిదండ్రులు భువనేశ్వర్‌లోని పాత ఇంట్లో ఉంటున్నారు. మరో 20 రోజులలో పెళ్లి కావలసి ఉండగా, సత్యబ్రత ఇంటికి రంగులు వేయించాలని భావించాడు. 
 
రంగులు కొనుగోలు చేయాలని సత్యబ్రత ఆ ఇంట్లో పనిచేసే నరేంద్ర అనే వ్యక్తితో కలిసి కొత్త ఇంటికి వచ్చాడు. నరేంద్రకు మద్యం అలవాటు ఉంది. రోజూ రాత్రి తాగి అల్లరి చేసేవాడు. ఈ దురలవాటు మానివేయమని సత్యబ్రత నరేంద్రను అనేక సార్లు మందలించాడు కానీ వినకపోవడంతో చేయిచేసుకునేవాడు. రంగులు కొనుగోలు చేసి మంగళవారం రాత్రి వారిద్దరూ కొత్త ఇంట్లో నిద్రపోయారు. 
 
ఈ నేపథ్యంలో నరేంద్ర అర్ధరాత్రి లేచి సత్యబ్రత తలపై గొడ్డలితో నరికి చంపేశాడు. 'మద్యం తాగవద్దని అడ్డుపడినందుకు చంపేశాను' అని సుద్ద ముక్కతో గోడపై కారణాన్ని రాసి అక్కడ నుంచి పరారయ్యాడు. ఖుర్దా పోలీసులు మృతదేహాన్ని పరీక్షల నిమిత్తం ఖుర్దా ఆసుపత్రికి తరలించారు, నరేంద్ర కోసం గాలింపులు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments